DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మానవాళికి ధన్యత కలిగించే వ్రతం ధనుర్మాస వ్రతం

*తిరుమలలో సుప్రభాతంకు మారుగా తిరుప్పావై పాశుర సేవ* 

*ధనుర్మాస వైభవం పై తిరుమల ఇద్దరు జీయర్ల స్వాముల సందేశం* 

*త్వరలో రానున్న DNS న్యూస్ వీడియో ఛానెల్ కు జీయర్ల మంగళాశాసనం*

*(DNS రిపోర్ట్ : మూర్తి DNS, ప్రత్యేక ప్రతినిధి, తిరుమల)*  

*తిరుమల, డిసెంబర్ 16, 2020  (డి ఎన్ ఎస్):* మానవాళికి

ధన్యత కలిగించే వ్రతం ధనుర్మాస వ్రతం అని, ఈ నెలరోజుల వ్రతాన్ని పాటించడం ద్వారా శుభఫలితాలు లభిస్తాయని తిరుమల పెద్ద జీయర్ స్వామి తెలియచేసారు. అతి త్వరలో ప్రారంభం కానున్న DNS న్యూస్ వీడియో ఛానెల్ దేవాలయం కు తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వాములు ప్రత్యేక మంగళశాసనములు అందించారు. 
అత్యంత పవిత్రమైన,

ప్రాధాన్యత కల్గిన ధనుర్మాసం లో ఆరంభమవుతున్న ఈ DNS న్యూస్ వీడియో ఛానెల్ ఎంతో ఉన్నత స్థితి కి చేరుకొని అందరి మన్ననలూ పొందాలి అని జీయర్ స్వాములు ఆశీస్సులు అందించారు. 

ధనుర్మాస వ్రత వైశిష్ట్యాన్ని తిరుమల పెద్ద జీయర్ స్వామి  DNS వార్త ప్రతినిధి కి తెలియచేసారు. బుధవారం తిరుమల ఆలయ సమీపం లోని పెద్ద జియ్యంగార్

స్వామి మఠం లో DNS మీడియా ద్వారా మానవాళికి మంగళాశాసనం పూర్వక   ప్రత్యేక సందేశం అందించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ భగవంతుణ్ణి చేరుకోవాలి అనే ఏకైక సంకల్పంతో 8 వ శతాబ్దంలో ఆండాళ్ అనే యువతి ఆచరించి చూపించిన వ్రతమే తిరుప్పావై వ్రతం అన్నారు. సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించిన రోజు నుంచి శుభ ఘడియల్లో దేశ విదేశాల్లో ఈ

వ్రతాన్ని అన్ని వైష్ణవ సాంప్రదాయ ఆలయాలు, గృహాల్లో ఆచరించడం జరుగుతుందన్నారు. ప్రతి రోజు బ్రహ్మాది దేవతలు సంచరించే తెల్లవారుఝాము సమయంలో ఈ పాశుర సేవను నిర్వహించడం ద్వారా శుభఫలితాలు లభిస్తాయన్నారు. ప్రస్తుతం కరోనా రాక్షసుని బారి నుంచి మానవాళిని రక్షించాలి అని తిరుమల శ్రీనివాసుని ప్రార్దిస్తున్నట్టు

తెలిపారు. 

సుప్రభాతంకు మారుగా తిరుప్పావై పాశురాలు: . . .

ధనుర్మాస వ్రతాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీనివాసుని ప్రధాన గర్భాలయం ఆనంద నిలయం లో ప్రతి రోజు నిర్వహించే సుప్రభాత సేవకు మారుగా తిరుప్పావై పాశుర సేవ జరుగుతుందన్నారు. తద్వారా ఆండాళ్ అందించిన పాశుర వైభవాలకు ఎంత ప్రాధాన్యత ఉందొ

తెలుస్తోందన్నారు. అనాది కాలంగా తిరుమల లో తిరుప్పావై సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ నెలలో అత్యంత ప్రాధాన్యమైన వైకుంఠ ఏకాదశి వైభవం ఈ నెల 25 న ఎంతో వైభవంగా నిర్వహించేందుకు ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. కరోనా ప్రభావంతో భక్తుల ఆరోగ్య రక్షణ కోసమే నిబంధనలు విధించడం జరిగిందన్నారు. 
/> అతి త్వరలోనే సామాన్యులు సైతం శ్రీనివాసుని యధావిధిగా దర్శించుకోవాలని మంగళాశాసనం  చేసారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam