DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నన్నయ వర్సిటీలో సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్: వీసీ మొక్కా

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, డిసెంబర్ 17, 2020  (డి ఎన్ ఎస్):*  తూర్పు గోదావరి జిల్లా లోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం లో సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్కును ఏర్పాటు చేసి విద్యార్థులకు అవసరమైన సాంకేతిక నైపుణ్య శిక్షణను అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రణాళిక రూపొందించాలని

వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు అన్నారు. యూనివర్సిటీలో సాఫ్ట్వేర్ పార్క్ ను ఏర్పాటు చేయాలని గత కొంత కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా జాయింట్ డైరెక్టర్ ఎ.వి. మల్లేశ్వరరావు గురువారం విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. విశ్వవిద్యాలయంలోని వనరులను, వసతులను ఆయన

పరిశీలించారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో ఈసీ హాల్ లో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. దీనిలో చేసి ఆచార్య మొక్క జగన్నాధ రావు మాట్లాడుతూ  ఉభయగోదావరి జిల్లాలకు విద్యా కేంద్రంగా ఉన్న ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్ ను ఏర్పాటు చేయడానికి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్

ఆఫ్ ఇండియా వారు పూర్తి సహకారాన్ని అందించాలని అన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఒక శిక్షణా కేంద్రాన్ని విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసి గోదావరి జిల్లాల విద్యార్థులకు సాంకేతిక అభివృద్ధిలో మెరుగైన శిక్షణను అందించాలని తెలిపారు. తద్వారా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలలో నన్నయ విద్యార్థులు ఉన్నత శ్రేణి

ఉద్యోగాలను అధిరోహించగలరని అన్నారు. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా వారికి అన్ని సాఫ్ట్వేర్ సంస్థలతో సంబంధాలు ఉంటాయని వాటిని విద్యార్థుల శిక్షణ, ఉద్యోగావకాశాలకు ఉపయోగించాలని కోరారు. భారతదేశంలో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆధ్వర్యంలో 60 కేంద్రాలు ఉన్నాయని దానిలో భాగంగా ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఒక

కేంద్రాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు శిక్షణ మరియు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తోడ్పాటును అందించాలని అన్నారు. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ మరియు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం మధ్య త్వరలో అవగాహన ఒప్పందం చేసుకుంటామని తెలియజేశారు. ఈ సందర్భంగా జాయింట్ డైరెక్టర్ ఏ.వీ.మల్లేశ్వరరావు ను వీసీ సన్మానించి అభినందనలు

తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య బట్టు గంగారావు, ప్రిన్సిపాల్ డా.వి.పెర్సిస్, డా.కె.రమణేశ్వరి, ఆచార్య వై శ్రీనివాసరావు, డా.డి.జ్యోతిర్మయి, డా.కె.నూకరత్నం, డా.కె.వి.స్వామి, డా.కె.దీప్తి, డా.ఎన్.ఉదయభాస్కర్,  డా.పి.వెంకటేశ్వరరావు మరియు ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam