DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పార్థసారథి మీకు ఏసు కావాలో, వేంకటేశు కావాలో తేల్చుకోండి?

*క్రిస్మస్ వేడుకలకు టిటిడి ట్రస్టీ హోదా లో ఎలా వెళ్తారు?* 

*క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనే టిటిడి సిబ్బందిని బదిలీ చెయ్యాలి.*

*టిటిడి సిబ్బంది క్రిస్మస్ వేడుకలపై బీజేపీ నిఘా పెడుతుందన్నారు.*  

*బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భానుప్రకాష్ మండిపాటు. .* 
 
*(DNS రిపోర్ట్ :  సాయిరాం

CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, డిసెంబర్ 22, 2020  (డి ఎన్ ఎస్):* టిటిడి ట్రస్ట్ బోర్డు సభ్యుడు కె. పార్ధ సారథికి యేసు కావాలో, వెంకటేశు కావాలో తేల్చుకోవాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెక్క భాను ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేసారు. . మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో

మాట్లాడుతూ కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా టిటిడి పాలకమండలి సభ్యుని హోదాలో కొలుసు పార్థసారథి సెమి క్రిస్మస్ వేడుకలకు హాజరు కాకూడదని హెచ్చరించారు. 
 తిరుమల కొండమీద గత ఆరు నెలలుగా నాదనీరాజన మండపంలో హిందూ ధార్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, వీటిల్లో కనీసం ఒక్క రోజైనా పార్థసారధి

పాల్గొన్నారా అని ప్రశ్నించారు. అయన క్రైస్తవ సభలకు హాజరు కావాలంటే తక్షణం టిటిడి లో పోస్ట్ వదులుకోవాలని తెలిపారు. ఈ సభకు వెళ్తారా లేదా అనేది మీడియా ముఖంగా ప్రకటించాలని పార్థసాధికి సూచించారు. ఆయన ఈ క్రిస్మస్ వేడుకలకు వెళ్లినట్టయితే త్వరలో జరిగే టిటిడి పాలక మండలి సమావేశాలకు పార్థసారధి హాజరుకాకుండా అడ్డుకుంటామని

హెచ్చరించారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ద్రుష్టి పెట్టాలన్నారు. 


*క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనే సిబ్బందిని బదిలీ చెయ్యాలి: . .*

ఈ నెల 25 న చర్చ్ ల్లో కానీ, ఇళ్లల్లో గానీ జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనే టిటిడి అధికారులు, ఇతర సిబ్బందిని టిటిడి నుంచి వేరే శాఖలకు తక్షణం

వారిని బదిలీ చెయ్యాలని ఈఓ ను డిమాండ్ చేసారు.  
టిటిడి సిబ్బంది చేసుకునే క్రిస్మస్ వేడుకలపై టిటిడి విజిలెన్స్ కళ్ళుమూసుకున్న, బీజేపీ, సంఘ్ పరివార్ పూర్తి నిఘా పెడుతుందన్నారు. ఎవరైనా దొరికితే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. 

ఆర్ఎస్ఎస్ స్టిక్కర్ చింపడంపై మండిపాటు. .. 

సోమవారం అలిపిరి

టోల్ గేట్ వద్ద ఒక కారు పై ఆర్ ఎస్ ఎస్ ( రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ) స్టిక్కర్ ఉండడంతో సెక్యూరిటీ అభ్యంతరం తెలిపి, చింపడం పై భానుప్రకాష్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. 

హిందూ ధార్మిక సేవ సంస్థలన్నింటికీ మాతృక ఆర్ ఎస్ ఎస్ అని, దీన్ని తెలిసి కూడా స్టిక్కర్ ను చింపడం అత్యంత దారుణమన్నారు. దీనిపై

ఉన్నతాధికారులు సెక్యూరిటీ వారికి సూచనలు చేయాలన్నారు. హిందూ ధార్మిక సంస్థలకు సంబంధించిన వాహనాలను అడ్డుకోరాదన్నారు. 

మాడ వీధుల్లో రాజకీయాలు మాట్లాడితే తప్పులేదా?. . .

అత్యంత పవిత్రమైన తిరుమల మాడ వీధుల్లో రాజకీయ నేతలు నోటికి వచ్చిన వ్యాఖ్యలు చేయడాన్ని అడ్డుకోవాల్సిన టిటిడి విజిలెన్స్

పూర్తిగా విఫలం చెందిందని, వాళ్లకి లేని అభ్యంతరం ఆర్ఎస్ఎస్  స్టిక్క్కర్ కు వచ్చిందా అని ప్రశ్నించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam