DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ కొత్త సీఎస్ ఆదిత్యానాథ్‌ దాస్, 31న బాధ్యతలు

*పురపాలకశాఖ కార్యదర్శిగా వై. శ్రీలక్ష్మి నియామకం*

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, డిసెంబర్ 22, 2020  (డి ఎన్ ఎస్):* ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్‌ నియమితులయ్యారు. ఈనెల 31న సీఎస్‌గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధాన

కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలం ఈనెల 31తో ముగియనున్న నేపథ్యంలో ఆమె స్థానంలో ఆదిత్యానాథ్‌ దాస్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. పదవీకాలం పూర్తి అనంతరం ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా నీలం సాహ్ని విధులు నిర్వర్తించనున్నారు. ప్రధాన కార్యదర్శితో పాటు మరికొన్ని స్థానాల్లో స్వల్ప మార్పులు

చోటుచేసుకున్నాయి. 

అక్రమ ఆస్తుల కేసులో వివాదాల్లో చిక్కుకుని జైలుకు కూడా వెళ్లి వచ్చిన ఐ ఏ ఎస్ వై. శ్రీలక్ష్మి ఇటీవలే  ఆంధ్ర ప్రదేశ్ కు బదిలీ అయినా విషయం తెలిసిందే. ఆమెను పురపాలకశాఖ కార్యదర్శిగా నియమించారు. ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ కార్యదర్శిగా శ్యామలరావు, సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా కె.సునీతను

నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి కార్యాలయం ఉత్తర్వలు జారీచేసింది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam