DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లో మతి భ్రమించే రాజకీయాలు

*జిల్లా యూత్ కాంగ్రెస్ సెక్రటరీ గా BJP నేత నియామకం,. ! !*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, డిసెంబర్ 22, 2020  (డి ఎన్ ఎస్):* మధ్య ప్రదేశ్ లో మంగళవారం జరిగిన ఘటనతో భారత దేశంలో రాజకీయాలు ఎంత కుళ్లిపోయాయో బాహిరగటం అయ్యాయి. గత 9 నెలల క్రితం పార్టీని వీడి బీజేపీ లో చేరిన హర్షిత్

సింఘయ్ అనే యువ నేతను. . జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. ఏకంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి అధికారికంగా ఆమోదముద్ర కూడా వచ్చేసింది. 

తనకు అందరూ శుభాకాంక్షలు తెలియచేస్తుండడంతో విస్తుపోయిన బీజేపీ నేత హర్షిత్ సింఘయ్, విషయం తెలుసుకుని నవ్వుకున్నారు. తానూ కాంగ్రెస్

పార్టీ లో ఉండగా మూడేళ్ళ క్రితం జరగవలసిన ఎన్నికల్లో తానూ పెట్టిన దరఖాస్తును నేటి ఎన్నికల్లో తొలగించకుండా, ఎన్నికలు పెట్టి, నియామకాలు ఖరారు చేసేశారన్నారు.  తానూ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నప్పుడు రాజీనామా లేఖ ఇచ్చి, తన దరఖాస్తును తొలగించమని లిఖిత పూర్వకంగా రాసినట్టు తెలిపారు. 

అయితే పార్టీని నడిపే

విధానం తెలియని మహామహులు అసలు పార్టీ లో ఎవరు ఉన్నారో, ఎవరు లేరో కూడా తెలుసుకోకుండానే కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్నారని ఎద్దేవా చేసారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam