DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తా: బైరెడ్డి శబరి

*తుంగ పుష్కరాల్లో స్నానాల ద్వారా సంచలనం చేసిన యువనేత* 

*బిజెపి యువమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియామకం.*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*అనంతపురం / విశాఖపట్నం, డిసెంబర్ 26, 2020  (డి ఎన్ ఎస్):* రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని, భారతీయ జనతా పార్టీ

యువమోర్చ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా నియమితులైన బైరెడ్డి శబరి తెలిపారు. శనివారం జరిగిన నియామకాల్లో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గం లో అనంతపురం కు చెందిన బైరెడ్డి శబరి ప్రధాన కార్యదర్శి గా నియమితులయ్యారు. రాయలసీమ లో బీజేపీ పార్టీ ని బలోపేతం చేసేందుకు నడుంబిగించిన ఉద్యమనేత బైరెడ్డి రాజశేఖర్ కుమార్తె

ఈమె. తండ్రితో పాటు పార్టీలో చేరిన నాటి నుంచి విస్తృతంగా కేంద్ర ప్రభుత్వ పధకాలను వాడవాడలా ప్రచారం చేస్తున్నారు. 

ఇటీవల జరిగిన తుంగ భద్ర పుష్కరాల్లో పుణ్య స్నానాలు చెయ్యడం ద్వారా భక్తుల్లో చైతన్యాన్ని రేకెత్తించిన యువనేత గా శబరి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. కరోనా పేరు చెప్పి హిందూ పండగలపై

ఉక్కుపాదం మోపిన వైఎస్ జగన్ ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేసిన యువనేత ఈమె. స్నాన ఘాట్ లో స్నానం చేసినందుకు ఈమెను పోలీసులు అరెస్ట్ చేసారు. అంతకు ముందు మూడు రోజుల పాటు గృహ నిర్బంధం చేసిన విషయం తెలిసిందే. 
తనపై ఎనలేని నమ్మకంతో పార్టీ ఉంచిన బీజేవైఎం రాష్ట్ర జనరల్ సెక్రటరీ బాధ్యతలను సంపూర్నంగా సద్వినియోగం

చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు కు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సురేంద్ర మోహన్ కు ధన్యవాదాలు తెలిపారు. నాపై మీరు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా రెట్టింపు స్పూర్తితో పార్టీ కోసం, పార్టీ బలోపేతం కోసం మరింత కృషి చేస్తానని తెలిపారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam