DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, డిసెంబర్ 26, 2020  (డి ఎన్ ఎస్):* మహిళల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు చేపడతామని ఏలూరు రేంజ్ డీఐజీ  కేవీ మోహన్రావు హెచ్చరించారు తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు పోలీస్ స్టేషన్ సాధారణ తనిఖీలు అనంతరం

 రామచంద్రాపురం డీఎస్పీ డి బాలచంద్రారెడ్డితో కలిసి  ఆయన  స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మహిళలకు ప్రత్యేక రక్షణ కొరకు దిశా పోలిస్ స్టేషన్ ఏర్పాటు చేశామని అలాగే వారి కొరకు టోల్ ఫ్రీ నెంబర్లను కూడా అందుబాటులోకి తెచ్చామని ఆపదలో ఉన్న మహిళలు ఈ నెంబర్లను వినియోగించుకోవాలని అన్నారు.

 అలాగే గత ఏడాది కంటే ఈ

ఏడాది నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని అన్నారు. ఇటీవల కాలంలో ఆన్ లైన్ మోసాలు ఎక్కువయ్యాయని మీ బ్యాంకు ఖాతా నంబరు కానీ ఓటీపీ నంబర్ కానీ అపరిచితులకు తెలపొద్దని తెలిపారు.  అలాగే పండగల పేరుతో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని వారిపై చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు.

 గంజాయి, సారా వంటి మత్తుపదార్థాలు అమ్మినా వాటి నిల్వ పై నిత్యం నిఘా ఏర్పాటు చేశామన్నారు.  ఆన్లైన్ మైక్రో ఫైనాన్స్ ఉచ్చులో ఎవరు పడొద్దని  హితవు పలికారు.

ఏలూరు రేంజ్ పరిధిలో నేరాలను అరికట్టడంలో మా శాఖ శక్తివంచన లేకుండా విధులు నిర్వహిస్తున్నారని కరోనా కష్టకాలంలో కూడా ప్రజల ప్రజల ప్రాణాలను కాపాడటం లో

ముందు వరుసలో పోలీస్ శాఖ ఉందని కరుణ వారియర్స్గా పనిచేసిన ప్రతి ఒక్కరినీ ఆయన ప్రత్యేకించి అభినందించారు. 

ఈ కార్యక్రమంలో మండపేట రూరల్ సిఐ కె మంగాదేవి, సిఐ కె లక్ష్మణ్ రెడ్డి, ఆలమూరు ఎస్సై ఎస్ శివప్రసాద్, అంగర ఎస్ఐ శాస్త్రి పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam