DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అది శిలువ కాదు. .పూర్ణ కుంభం, అపోహాలపై టిటిడి వివరణ

*మంత్రుల క్రిస్మస్ శుభాకాంక్షలపై టిటిడి చేతులెత్తేసింది.* 

*ముక్కోటి అలంకరణపై DNS వార్తకు స్పందన*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, డిసెంబర్ 28, 2020  (డి ఎన్ ఎస్):* సాక్షాత్తు తిరుమల మహా ప్రాకారం పై శిలువ గుర్తులతో విద్యుత్ అలంకారం చేసారంటూ DNS media లో వచ్చిన

వార్తల పై తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)  అధికారులు స్పందించారు. దూరం నుంచి చూసేవారికి శిలువ ఆకారం లో కనపడుతున్నప్పడికి ఆ చిహ్నం ఒక కుంభం ( కలశ) అని, దగ్గర నుంచి చూస్తే సరిగ్గా తెలుస్తోందంటూ వివరణ ఇచ్చారు. దాని గుర్తును పోలిన ఒక చిత్రాన్ని విడుదల చేసారు.     

మంత్రుల క్రిస్మస్ శుభాకాంక్షలపై

చేతులెత్తేసింది: . .

వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల శ్రీవారి ఆలయ ప్రాకారం పై విద్యుత్ అలంకారం లో అన్యమత గుర్తులపై వివాదం వచ్చిన గంటలో స్పందించిన టిటిడి, 

అదే వైకుంఠ ఏకాదశి రోజున ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ లు స్వామి దర్శనం అనంతరం బయటకు

వచ్చి గుడి ముందే రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడం పై మాత్రం టిటిడి వివరణ ఇవ్వకుండా చేతులెత్తేసింది. దీనిపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తారా అని మీడియా అడిగిన ప్రశ్నకు వివరణ ఇవ్వక పోవడం గమనార్హం. ఇదే సామాన్య ప్రజలు ఈ తప్పిదం చేస్తే టిటిడి చట్టాల ప్రకారం సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్ కు

తరలించడం జరుగుతుంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam