DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సీతారామస్వామి గుడిలో వైభవంగా సాగుతున్న ధనుర్మాస వేడుకలు

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, డిసెంబర్ 29, 2020  (డి ఎన్ ఎస్):* విశాఖ శివారు ప్రాంతమైన చినముషిడివాడ శ్రీ సీతారామస్వామి ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ సలహాదారు శ్రీమాన్ ఫణిహారం వెంకట నరసింహాచార్యులు, ( శ్రీవైష్ణవ సంక్షేమ సంఘం, ప్రధాన కార్యదర్శి),

తెలియచేసారు. మంగళవారం 14 వ రోజు పాశుర విన్నపం చేసి స్వామికి, ఆండాళ్ కు ప్రత్యేక ఆరాధనలు చేసినట్టు తెలిపారు. ఈ నెల 16వ తేదీ నుంచి మొదలైన ధనుర్మాసమహోత్సవములను ఈ ఆలయంలో ప్రతి ఏటా అత్యంత వైభవంగా ఈ వేడుకలు గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఆలయంలో ధనుర్మాస వేడుకలు భక్తులందరి సహకారంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

 ధనుఃసంక్రమణ శుభ సమయంలో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు నెల రోజుల పాటు దీక్ష పూర్వకంగా నిర్వహించనున్నారు. ప్రతిరోజు ఉదయం  గోదారంగనాథులకు అష్టోత్తర శతనామార్చన,  తిరుప్పావై సేవాకాలం,  ఆనాటి పాశుర వైభవమును పెద్దల ద్వారా వివరణ ఉంటుందని వివరించారు. అత్యంత ప్రాశస్త్యమైన వైకుంఠ ఏకాదశి వేడుక సందర్బంగా ఈ నెల 25 న ప్రత్యేక

దర్శనం కల్పించామన్నారు. ధనుర్మాసం లో సంపూర్ణ ఘట్టం కూడారై ఉత్సవం, జనవరి 11 న ఈ వేడుకలు వైభవంగా జరిపేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారన్నారు. 

ప్రస్తుత పరిస్థితుల ప్రకారం కరోనా మహమ్మారి ని నిరోధించే విధంగా భక్తులు ముఖానికి ప్రతిక్కరూ మాస్కులు ధరించి, కనీస దూరం

పాటించాలన్నారు. 

భక్తుల పేరిట వారి గోత్ర నామాలతో ప్రతిరోజూ సేవాకాలం ఆరాధనలో తెలియచేయడం జరుగుతుందన్నారు. ఆలయంలో జరిగే ఉత్సవ వేడుకలలో పాల్గొనేందుకు ఆలయ అర్చకులను మొబైల్ నెంబర్ 9948151759 లో సంప్రదించాలన్నారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam