DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఢిల్లీ లో ఎస్వీ కాలేజీ లో నూతన భవన సముదాయం ప్రారంభం 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, డిసెంబర్ 29, 2020  (డి ఎన్ ఎస్):* దేశరాజధాని న్యూ ఢిల్లీ లోని శ్రీ వేంకటేశ్వర కాలేజీలో కొత్త భవన సముదాయాన్ని టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి మంగళవారం ప్రారంభించారు. కోట్లాదిమంది హిందూ సంప్రదాయపరుల ఆరాధ్యదైవమైన తిరుమల శ్రీనివాసుని

ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానములు ( టిటిడి) ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్న శ్రీవెంకటేశ్వర విద్య యజ్ఞం లోని భాగమైన విద్యాసంస్థలు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహించబడుతున్నాయి. దేశ రాజధాని హస్తినలో ఈ విద్య కళాశాలలోని భవన సముదాయం లో దుర్గాబాయి దేశముఖ్ భవన  ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీటీడీ ఈవో

జవహర్ రెడ్డి, పాలకమండలి సభ్యులు ప్రశాంతి రెడ్డి, నిష్చల పాల్గొన్నారు. 

శ్రీ వేంకటేశ్వర కాలేజీకి స్వయంప్రతిపత్తి యూనివర్సిటీ హోదా కల్పించాలని, ఈ కాలేజీలో ఐదు శాతం మేనేజ్మెంట్ కోటా సీట్లకు కేంద్రం అనుమతి ఇచ్చిందని టిటిడి ఎస్ వి సుబ్బారెడ్డి తెలిపారు. ఈ కోటా కింద తెలుగు విద్యార్థులకు అవకాశం వచ్చే

ఏర్పాటు చేస్తామని తెలియచేసారు.  అయితే త్వరలోనే తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (తిరుపతి), తిరుపతి వెంకటేశ్వర కాలేజ్ (న్యూఢిల్లీ) ఈమధ్య అధ్యాపకుల ఎక్స్చేంజ్ ప్రోగ్రాం జరపాలని నిర్ణయించామన్నారు. తిరుపతి వేదిక్ యూనివర్సిటీకి, సంస్కృత వర్సిటీకి యుజీసి గ్రాంట్స్  ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam