DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రామతీర్ధాల కొండపై రామునిపై రావణాసురుల పైశాచికత్వం

*శ్రీరాముని విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై నిరసనలు.*

*దోషులను శిక్షించాలని  ఏపీ సాధుపరిషత్ అధ్యక్షులు డిమాండ్*  

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, డిసెంబర్ 29, 2020  (డి ఎన్ ఎస్):* రామతీర్ధాలు కొండపై రామాలయ ధ్వంసం చేసిన కొందరు పిచ్చెక్కిన అన్యమత

మతోన్మాదులని తక్షణం శిక్షించాలని ఏపీ సాధుపరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వామి డిమాండ్ చేస్తున్నారు. మంగళవారం ఉదయం ఆలయాన్ని సందర్శించిన అయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా అయన మీడియా తో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అయోధ్య గా పేరుగాంచిన విజయనగరం జిల్లా రామతీర్ధాలు పుణ్యక్షేత్రం లోని కొండపై గల

ఆలయంలో కొందరు పిచ్చెక్కిన అన్యమత మతోన్మాదులు  శ్రీరాముని విగ్రహాన్ని  మేడవరకూ ధ్వంసం చేసి, రాములవారి శిరస్సును తమవెంట పట్టుకెళ్లడంపై మండిపడ్డారు. రాష్ట్రంలో గత రెండేళ్ల కాలంలో సుమారు 20 కి పైగా హిందూ దేవాలయాల్లో కొందరు పిచ్చెక్కిన అన్యమత మతోన్మాదుల దాడుల్లో ఎన్నో విలువైన, చారిత్రాత్మక హిందూ ఆస్తులు,

విగ్రహాలు ధ్వంసం అయినా నేటికీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. ఇంతవరకూ ఒక్క కేసులో కూడా దోషులను పట్టుకున్న దాఖలాలు లేవన్నారు. సెక్యులర్ పేరుతొ హిందువులపై ఎటువంటి దారుణాలు జరుగుతున్నా అడ్డుకునేవాడే లేకుండా పోయిందన్నారు. దీనిపై విచారణ జరిపించి తక్షణం దోషులను శిక్షించాలని దోషులను శిక్షించాలని  ఏపీ

సాధుపరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వామి డిమాండ్ చేస్తున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam