DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రామతీర్థం లో శ్రీరామ విగ్రహం ధ్వంసం పై మంత్రి వెలంపల్లి సీరియస్

*విచారణాధికారిగా ఆర్ జె సి భ్రమరాంబ నియామకం*

*చలిలోనూ సాగుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డి పావని దీక్ష. .*

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, డిసెంబర్ 29, 2020  (డి ఎన్ ఎస్):*     

ఉత్తరాంధ్ర అయోధ్యగా ప్రసిద్ధి చెందిన విజయనగరం జిల్లా రామతీర్థం కొండపై

రామచంద్రమూర్తి విగ్రహాన్ని కొందరు మదమెక్కిన కొందరు  విధ్వంసం చేసిన ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సీరియస్ అయ్యారు. మంగళవారం సాయంత్రం విజయనగరం జిల్లా ఎస్పీ తో మాట్లాడి, ఘటన పూర్వాపరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనపై విచారణాధికారిగా రీజనల్ జాయింట్ కమిషనర్ స్థాయి అధికారిని నియమించాలని దేవాదాయశాఖ

ప్రత్యేక కమిషనర్ ను ఆదేశించారు. మంత్రి ఆదేశానుసారం మల్టీ జోన్ టు ఆర్ జె సి డి. భ్రమరాంబ విచారణ అధికారిగా నియమించారు. విచారణ వేగవంతం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని ఆదేశాలు జారీచేశారు.

చలి లోనూ బీజేపీ జిల్లా అధ్యక్షులు దీక్ష. . 

   అత్యంత ప్రాశస్త్యమైన ఆలయం పై జరిగిన దుర్ఘటనకు కారణమైన

వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ తో విజయనగరం బీజేపీ అధ్యక్షులు రెడ్డి పావని ఆధ్వర్యంలో బీజేపీ నాయకులూ, కార్యకర్తలు మంగళవారం ఉదయం నుంచి నిరసనలు చేసారు. రాత్రి చలిలోనూ అదే కొండపై వాళ్ళు దీక్షను కొనసాగిస్తున్నారు. 

బుధవారం టీడీపీ మౌన ప్రదర్శన: . . 

ఇలావుండగా శ్రీరాముని విగ్రహాన్ని కొందరు

దుండగులు.విధ్వంసం చేసినందుకు నిరసనగా బుధవారం ఉదయం రామతీర్థం ఆలయం వద్దకు తెలుగుదేశంపార్టీ         అధ్వర్యంలో ఉదయం ఆ పార్టీ కార్యాలయం నుండి 9గం.లకు మౌనప్రదర్శన బయలుదేరి ఆలయం వద్ద కొనసాగించనున్నట్లు విజయనగరం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి అదితి గజపతిరాజు ఒకప్రకటనలో తెలిపారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam