DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హిందూ చారిత్రక ఆలయాలపైనా రాక్షసత్వం ప్రదర్శిస్తారా?

*పోలీసులు, ఆలయ అధికారులు ఏమి చేస్తున్నారు?*

*రామతీర్ధాల ఘటన పై శ్రీ వైష్ణవ సంక్షేమ సంఘం మండిపాటు.* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, డిసెంబర్ 29, 2020  (డి ఎన్ ఎస్):* వ్యక్తులపై ఉన్న కోపాన్ని, వేలాది సంవత్సరాల చరిత్ర కల్గిన హిందూ చారిత్రక ఆలయాలపై

రాక్షసత్వం ప్రదర్శిస్తారా అని భగవద్రామానుజ  శ్రీవైష్ణవ సంక్షేమ సంఘం మండిపడింది. మంగళవారం విజయనగరం లోని ప్రసిద్ధ రామతీర్ధాలు క్షేత్రంలోని కొండపై ఉన్న ఆలయంలోని శ్రీరామ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై వైష్ణవ సంఘం గౌరవ అధ్యక్షులు శ్రీమత్ తిరుమల రంగనాధ అయ్యంగార్ తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేసారు. ఈ ఘటనపై స్పందిస్తూ. .

వ్యక్తిగత కోపాలుంటే వేరే విధంగా చూసుకోవాలి తప్ప, ఎంతో పవిత్రమైన ఆరాద్యమైన శ్రీరామ విగ్రహాలను ధ్వంసం చేస్తారా అని ప్రశ్నించారు. 

పోలీసులు, అధికారులు ఏమి చేస్తున్నారు?

ఎంతో వైభవం కల్గిన ఆలయంలోని విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే స్థానిక పోలీసులు, ఆలయ అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ ఆలయం

రాష్ట్ర దేవాదాయ శాఖా పరిధిలో ఉన్నప్పటికీ ఈ ఘోరం జరిగింది అంటే. . ఆలయ అధికారుల నిర్లక్ష్యం బహిర్గతమైందన్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లోని ఎన్నో హిందూ దేవాలయాలపై దాడులు జరిగిన రోజే దోషులపై కఠిన చర్యలు తీసుకుని ఉంటె. .ఈ రోజు ప్రసిద్ధ ఆలయం సురక్షితంగా ఉండేదన్నారు. తక్షణం జరిగిన ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపించి

దోషులను శిక్షించాలని డిమాండ్ చేసారు.   

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam