DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఫిబ్రవరి 1 నుంచి కళాభారతి లో త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు 

*కోవిడ్ నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్ల తో సిద్దమవుతున్న కళాభారతి*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, డిసెంబర్ 30 , 2020  (డి ఎన్ ఎస్):* సంగీత సామ్రాజ్యంలో నిత్య ఆరాధనలు ఆదుకునే త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాలను విశాఖ లోని కళాభారతి ప్రాంగణం సిద్ధమవుతోంది. రానున్న పుష్య

బహుళ పంచమి ఫిబ్రవరి 2, 2021 వ తేదీన కావడంతో ఫిబ్రవరి 1 నుండి 6వ తేది వరకు ఎప్పటిలాగే త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాలు 6 రోజులు వైభవంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు కళాభారతి సంస్థ కార్యదర్శి జి ఆర్ కె ప్రసాద్ ( రాంబాబు) తెలియచేస్తున్నారు. అయితే ప్రస్తుతం కోవిద్ ప్రభావం కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ అత్యంత

పటిష్టమైన భద్రతా చర్యలను చేపడుతున్నట్టు తెలిపారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను ప్రారంభం చేస్తూ, ఈ ఉత్సవాల్లో పాల్గొనే కళాకారులను సాదర పూర్వకంగా ఆహ్వానిస్తూన్నట్టు తెలిపారు. సంబంధిత నమూనా లు కళాకారులూ దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించారు. ఆ నాటికి కరోనా ప్రభావం సంపూర్నంగా తగ్గి అన్ని పరిస్థితులు అనుకూలంగా

ఉంటాయని ఆసిస్తున్నట్టు ఆశాభావం వ్యక్తం చేసారు.  

త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ స్థాపించి 25 సంవత్సరాలు అయిందని, గత 25 సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రారంభంలో మూడు రోజులు , తర్వాత నాలుగు రోజులు , తర్వాత ఐదు రోజులు , ఇప్పుడు ఆరు రోజుల పాటు త్యాగరాజ స్వామి వారి వర్ధంతి ఉత్సవాలు పండుగ వాతావరణంలో

జరుపుకుంటున్నామన్నారు. 

వందలాది మంది చిన్న, పెద్ద కళాకారులు ఏడేళ్ల నుంచి వయో వృద్ధులు, జ్ఞాన వృద్ధుల వరకూ అన్ని వయసుల వారూ ప్రతి ఏటా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారన్నారు. 

ఫిబ్రవరి 2,  2020 పుష్య బహుళ పంచమి నాడు కళాభారతి లో ఉన్న త్యాగరాజ స్వామి ఆలయంలో విశేష పూజలు చేసి ఏడున్నర గంటల నుంచి 8 :15 వరకు సీతా

రామ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్  విగ్రహాలను పల్లకిపై అలంకరించి, 150 కి పైగా కళాకారులు  కళాభారతి చుట్టూ ఉన్న మాడ వీధులలో త్యాగరాజ కీర్తనలు గానం చేస్తూ ఘన నివాళి అర్పిస్తారన్నారు. అనంతరం ఉదయం 8:15 నిమిషాలకు జ్యోతి ప్రజ్వలనం గావించి 250 మంది కళాకారులు త్యాగరాజ స్వామివారి పంచరత్న కృతులను బృందగానం

చేస్తారు.

తదనంతరం నాదస్వర కచేరి తో ప్రారంభమై రాత్రి 9:30 గంటల వరకు  పది నిమిషాలు, 15 నిమిషాలు, అరగంట కచేరీలు ఐదు రోజులపాటు జరుగుతాయన్నారు. ఈ ఉత్సవాలలో గాత్ర వాద్య కచేరీలే కాకుండా,  అరగంట సేపు నృత్య ప్రదర్శన కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. చివరి రోజున హనుమాన్ చాలీసా పఠనం జరుగుతుందని తెలిపారు.

 

నూట ఎనిమిది వడలతో చేసిన వడమాలను పంచముఖ ఆంజనేయ స్వామికి సమర్పించి,  మంత్రపుష్పం ,చతుర్వేద పారాయణ తర్వాత ఆశీర్వాద స్వస్తి వచనాలతో ఆరు రోజుల త్యాగరాజస్వామి వర్ధంతి ఉత్సవాలు ముగుస్తాయి .

వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అవకాశం ఉన్నవారందరికి పాల్గొనే అదృష్టం కల్పిస్తానమ్మారును. పక్క

వాయిద్యాలు మీద 27 మంది, వయొలిన్ పై 39 మంది సహకరిస్తున్నారు.

విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనే  కాకుండా అమెరికా, అట్లాంటా, మేరీల్యాండ్, చెన్నై, బెంగుళూరు, మంగళూరు, హైదరాబాద్, సికింద్రాబాద్, ఏలూరు, నూజివీడు, కాకినాడ తదితర ప్రాంతాల నుంచి అనేక మంది కళాకారులు ఈ ఉత్సవాల్లో ప్రతి సారి

పాల్గొంటున్నారు.

ఇందులో  A టాప్ గ్రేడ్, A గ్రేడ్,  B హై గ్రేడ్, B గ్రేడ్ సహా వర్ధమాన కళాకారులంతా పాల్గొంటున్నారన్నారు.

ప్రతిరోజు మధ్యాహ్నం పాల్గొనే కళాకారులందరికీ ఉచిత వర్కింగ్ లంచ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు త్యాగరాజ ఆరాధన ట్రస్ట్,  విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కళాభారతి

సంయుక్తంగా నిర్వహించడం జరుగుతోంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam