DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేవాదాయ మంత్రి ని భర్తరఫ్ చెయ్యాలని బీజేపీ డిమాండ్

*అయోధ్య లో రామాలయ స్థాపన. . ఇక్కడ విగ్రహ ధ్వంసమా?* 

*జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తిన రామతీర్ధాలు కొండ.*

*చలో రామతీర్థంలో విష్ణు కుమార్ రాజు, భారీగా బీజేవైఎం క్యాడర్* 

*దేశంలో రావణుడు, తాటకి లు పాలిస్తున్నారు: సాధుపరిషత్* 

*అన్యమతోన్మాద పిచ్చొళ్ల ని ఎందుకు ఆపలేదు?: ఫణి* 
/>  
*రామతీర్ధాలు కొండపైకి పూర్తి నిషేధం, భారీ పోలీసుబందోబస్ట్*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, డిసెంబర్ 30, 2020  (డి ఎన్ ఎస్):* గత 18 నెలల్లో 23 కి పైగా ఆలయాల ధ్వంసం చేశారని, తక్షణం దేవాదాయ శాఖామంత్రి వెల్లంపల్లిని మంత్రిమండలి నుంచి భర్తరఫ్ చెయ్యాలని బీజేపీ రాష్ట్ర

ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు డిమాండ్ చేసారు. విజయనగరం జిల్లా లోని 400 ఏళ్ల చరిత్ర గల ప్రముఖ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం అయిన రామతీర్థం కొండపై గల దేవాలయం లోకి కొందరు దుండగులు ఉద్దేశపూర్వకంగా ఆలయంలోకి ప్రవేశించి విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనకు నిరసనగా బీజేపీ వర్గాలు నిర్వహించిన చలో రామతీర్ధాలు

ఉద్యమంలో అయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్లాదిమంది హిందూ భక్తుల విశ్వాసాలను దెబ్బతీసే విధంగా హిందూ వ్యతిరేక పాలనా ఆంధ్ర ప్రదేశ్ లో సాగుతోందన్నారు. ఏడాదికి వేల కోట్లాది రూపాయల ఆస్తులను ఇస్తున్నహిందూ దేవాలయాలను కాపాడవలసిన దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పూర్తిగా నిర్లక్ష్యంగా ఉండి,

అన్యమతాల ఉద్దరణకై కంకణం కట్టుకున్నారని, అయన మా దేవాదాయాలకు అవసరం లేదని, తక్షణం అతన్ని మంత్రిమండలి నుంచి భర్తరఫ్ చెయ్యాలని డిమాండ్ చేసారు. రామ తీర్ధాల కొండపై జరిగిన ఘోరం అన్యమత మతోన్మాదులు చేసిన చర్యకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భాద్యత వహించాలని డిమాండ్ చేసారు. ఈ దాడిలో శ్రీ రాముల వారి యొక్క శిరస్సును ఖండించి

ఉన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి దాడి చేసిన దోషులను తగు శిక్షపడేలా చూసి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. 

*ఈ దేశంలో రావణుడు, తాటకి ఇంకా బ్రతికే ఉన్నారు.* 

హిందూ దేవాలయంపై దాడులు, హిందూ సంప్రదాయవాదులపై ఈ

దేశంలో దాడులు జరుగుతున్నాయంటే. . .ఈ దేశంలో రావణాసురులు, తాటకి, సూర్ఫణఖలు ఇంకా బ్రతికే ఉన్నారని, ఏపీ సాధుపరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి స్వామి తెలిపారు. చలో రామతీర్ధాలు కార్యక్రమం లో అయన మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో క్రైస్తవ పాలనా పెరిగిపోయిందని, హిందూ దేవీదేవతలు ఆలయాలు సుమారు 100 కి పైగా పిచ్చెక్కిన

మతోన్మాదుల మతిస్థిమితం లేని వాళ్ళ దాడులకు భిన్నమయ్యాయన్నారు. 18 నెలల క్రితం పిఠాపురం లో ఘటన జరిగినప్పుడే ముఖ్యమంత్రి వీళ్ళ పై కఠిన చర్యలు తీసుకుని ఉంటె ఈ రోజు రామతీర్ధాలు ఘటన జరిగి ఉండేది కాదన్నారు.  

ఈ దేశంలో రావణాసురులు, తటాకాలు పాలిస్తున్నారు: . .

ఈ దేశంలో కొన్ని చోట్ల రావణాసురులు, తాటకి, అలాగే

సూర్పణఖలు కూడా పాలిస్తూ, హిందూ ధర్మాన్ని ధ్వంసం చేస్తున్నారని, హిందూవులపై హత్యాకాండను చేస్తున్నారని ఆంధ్ర ప్రదేశ్ సాధుపరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వామి డిమాండ్ చేస్తున్నారు. రావణాసురుల పాలనా నుంచి హిందూ దేవాలయాలకు విముక్తి కల్గించాలని శ్రీనివాసానంద కోరుతున్నారు. వందలాది సంవత్సరాల నుంచి

పోరాటం చేసి అయోధ్య లో శ్రీరాముని జన్మ స్థలంలో భవ్యరాముని మందిరం నిర్మిస్తున్నారన్న ఆనందం లో ఉన్న భక్తులకు, రామతీర్ధాల ఘటన కలిచివేసిందన్నారు.  రామతీర్ధాలు కొండపై రామాలయ ధ్వంసం చేసిన కొందరు పిచ్చెక్కిన అన్యమత మతోన్మాదులని తక్షణం శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. 

*అన్యమతోన్మాద పిచ్చొళ్ల ని ఎందుకు

ఆపలేదు?: ఫణి* 

చలో రామతీర్ధాలు నేపథ్యంలో కొండపైకి వెళ్లేందుకు అన్నిదారులనూ పోలీసులు మూసేసారు. పైగా పూర్తి నిషేధాజ్ఞలు విధించారు. దీనిపై బీజేవైఎం విశాఖ అధ్యక్షులు విజయ్ శంకర్ ఫణి మండిపడ్డారు. శ్రీరాముని ఆలయం ప్రస్తుతం ఏ స్థితిలో ఉందోచూసేందుకు వచ్చిన భక్తులపై పోలీసులు నిషేధం విధించారని, విగ్రహాలపై

 దాడి చేసినవాళ్లను ఎలా అనుమతించారని ప్రశ్నించారు. 

పెద్ద సంఖ్యలో బీజేపీ విజయనగరం అధ్యక్షులు రెడ్డి పావని, విజయనగరం నాయకులూ, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam