DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రామతీర్థం కొండ పైన కోనేరు లోనే ఖండిత భాగం లభ్యం

*పారదర్శకంగా విచారించండి, భ్రమరాంబతో విహెచ్పి, బీజేవైఎం వినతి*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, డిసెంబర్ 30, 2020  (డి ఎన్ ఎస్):* మంగళవారం ఉదయం విజయనగరం జిల్లా రామతీర్ధాల క్షేత్రం కొండపై రామాలయ విగ్రహాన్నీ ధ్వంసం చేసిన అన్యమత పిచ్చెక్కిన మతోన్మాద ఉగ్రవాదులు

ఖండిత భాగం దగ్గరలోని కోనేటిలోనే పారేసి పోయారు. బుధవారం రామతీర్థం కొండవద్దే నిరసనలు చేస్తున్న భారతీయ జనతా పార్టీ యువ కార్యకర్తలకు ఈ కోనేటి లోనే ఖండిత భాగం లభించింది. కోట్లాది మంది హిందువులు ఆరాధించుకునే శ్రీరాముని విగ్రహం ఈ స్థితిలో దర్శనమిచ్చేసరికి ఒక్కసారిగా బీజేవైఎం కార్యకర్తలు ఆవేదనకు గురయ్యారు. స్థానిక

యువకులు ఈ విగ్రహ భాగాన్ని వెలిసి తీసి జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ పోలీసులకు అప్పగించారు. భిన్నమైన విగ్రహం విగత రూపంలో దర్శనమివ్వడంతో విశ్వహిందూ పరిషత్ విశాఖ జిల్లా సంయుక్త కార్యదర్శి పూడిపెద్ది శర్మ,  బీజేవైఎం విశాఖ అధ్యక్షులు విజయ్ శంకర్ ఫణి  , బీజేపీ నేతలు సహా పొలిసు వర్గాలు సైతం హతాషులవ్వడం

గమనార్హం. 

ఇదే సమయంలో అక్కడికి వచ్చిన విచారణాధికారి ఆర్ జెసి 2 డి. భ్రమరాంబ తో వి హెచ్ పి , బీజేవైఎం ప్రతినిధులు ఘటనపై వివరించారు. విచారణ నిష్పక్షపాతంగా జరపాలని, హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసిన ఈ ఘటనలో దోషులు తప్పించుకోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam