DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వీడియో ద్వారా కేసుల పురోగతిపై డిఐజి సమావేశం

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, డిసెంబర్ 30, 2020  (డి ఎన్ ఎస్):* ఏలూరు రేంజ్ డిఐజి కె.వి.మోహన్ రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ కేసులపై  తూర్పగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి  జిల్లా, కృష్ణ జిల్లాలలో జరుగుతున్నా విచారణ లను తెలుసుకున్నారు. ఇప్పటివరకు నమోదు అయిన మరియు విచారణలో

ఉన్న కేసులను గురించి, సదరు కేసులలో ఇప్పటి వరకు అధికారులు చేసిన దర్యాప్తు గురించి, ముద్దాయిల యొక్క అరెస్ట్ ను గురించి డిఎస్పీ లతో  ప్రత్యక్షంగా మాట్లాడుతూ సదరు  కేసుల యొక్క ఫైల్ లను డి. ఐ.జి గారు పరిశీలించి కేసు యొక్క దర్యాప్తు సమయంలో పాటించవలసిన మరియు తీసుకోవలసిన చర్యలను గురించి తగిన సూచనలను సలహాలు,

ఆదేశాలిస్తూ, ఎస్సీ &ఎస్టీ  కేసులలో దర్యాప్తు పూర్తి చేసిన  అనంతరం  చార్జిషీట్ లను సంబంధిత  కోర్టులలో ఫైల్ చేసే విషయాల పై అధికారులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఆయా కేసులలో కోర్టులో విచారణలో ఉన్నటువంటి కేసులలో ముద్దాయిలు యొక్క హాజరు సక్రమంగా జరుగుతుంది లేనిది అనే విషయం పైన అధికారుల

వద్ద నుండి వివరములు డిఐజి అడిగి తెలుసుకున్నారు. కేసుల దర్యాప్తులో అలసత్వం వహించకూడదని,  కాలపరిమితి లోపు కేసులలో దర్యాప్తు పూర్తి చేయాలి అని అధికారులకు డి. ఐ.జి గారి ఆదేశాలు ఇచ్చారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam