DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కేసీఆర్ ఒక్క రాత్రిలో బంగారు తెలంగాణగా మార్చేస్తారేమో? 

*సీఎం కేసీఆర్ ప్రకటనలపై బీజేపీ నేత విజయశాంతి ఎద్దేవా*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*హైదరాబాద్ / విశాఖపట్నం, డిసెంబర్ 31, 2020  (డి ఎన్ ఎస్):* సీఎం కె.చంద్రశేఖర్ రావు ( కేసీఆర్ ) కురిపిస్తున్న వరాల జల్లు చూస్తుంటే రాత్రికి రాత్రే రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేయాలని

చూస్తున్నట్టు కనిపిస్తోందని భారతీయ జనతా పార్టీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి ఎద్దేవా చేసారు. ఎన్నికల్లో ఓట్లు దండుకోడానికి ప్రచారం లో ఇచ్చిన హామీలను గత ఆరేళ్ళ కాలంలో నెరవేర్చని కేసీఆర్ కి హఠాత్తుగా రాష్ట్ర ప్రజలపై ప్రేమ పుట్టుకొచ్చిందన్నారు. ఉద్యోగాల భర్తీ, ఫిబ్రవరిలో పీఆర్సీ, ప్రమోషన్లు, బదిలీలు, సాగు చట్టాలకు సై

అనడం, ఎల్ఆర్ఎస్‌పై వెనక్కి తగ్గడం... ఇలా గత నాలుగైదు రోజులుగా  చేస్తున్న ప్రకటనల మర్మమేంటో ఎవరికీ తెలియదనుకుంటే పొరపాటు అన్నారు. 
గడచిన టీఆరెస్ ఆరేళ్ళ పాలనా కాలంలో జనం గుండెలు బాదుకున్నా పట్టించుకోని సమస్యలపై ఇప్పుడు ఒకొక్కటిగా దృష్టి సారిస్తుండటం వెనుక కుట్ర కాక ప్రజా సంక్షేమం ఉందని ప్రజలు నమ్మే

పరిస్థితుల్లేవన్నారు. 

అయితే, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలు ప్రభుత్వ అధినేత అహంకారాన్ని కొంత దారికి తెచ్చినట్లు అనిపిస్తుంది. ఇలాంటి పరిణామాలే వరంగల్, ఖమ్మం కార్పోరేషన్లు, రాబోయే ఉపఎన్నికల్లోనూ వస్తే... ఈ సీఎం ఎంతో కొంత జన సంక్షేమం గురించి కనీసం ఆలోచించి, తద్వారా మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు,

ఎమ్మెల్సీలు, ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు విలువ, సమయం, అపాయింట్‌‌మెంట్లు ఇచ్చి ప్రజా సమస్యలపై కొంత దృష్టి పెట్టే ప్రయత్నం జరగవచ్చు అన్నారు. అందుకోసమైనా తదుపరి ఎన్నికల ముందువరకూ కొంతకాలం అధికారంలో ఉండే ఈ టీఆరెస్ ప్రభుత్వానికి, ప్రతి సందర్భంలోను ఓటమి రుచి చూపించవలసిన బాధ్యత ఉందని తెలంగాణ సమాజం

అభిప్రాయపడుతోందని తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam