DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ధర్మ రక్షణ చేసే జీయర్ స్వాములను కించపరుస్తారా?

*రాష్ట్రంలో జీయర్లు దేవాలయాలపై బ్రతుకుతున్నారా?*

*ముందే పర్యటించిన స్వామిజీలపై అయ్యన్న అనుచిత వ్యాఖ్యలా?*

*మాజీమంత్రి అయ్యన్న పై మండిపడుతున్న శ్రీ వైష్ణవ సంఘం* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విజయనగరం / విశాఖపట్నం, జనవరి 01, 2021  (డి ఎన్ ఎస్):*

ఉత్తరాంధ్ర అయోధ్యగా పేరుపొందిన విజయనగరం జిల్లాలోని రామ తీర్ధం ఆలయం లో జరిగిన దుర్ఘటన పై జరుగుతున్న రాజకీయ ధర్నాల్లో గురువారం మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు జీయర్ స్వాములపై చేసిన అనుచిత వ్యాఖ్యలను భగవద్రామానుజ శ్రీవైష్ణవ సంక్షేమ సంఘం, గౌరవ అధ్యక్షులు శ్రీమత్ తిరుమల రంగనాధ అయ్యంగార్, ప్రధాన కార్యదర్శి పివిఎన్

ఆచార్యులు తప్పుపట్టారు.  

రాష్ట్రంలోని జీయర్ స్వాములు దేవాలయాలపై బ్రతుకుతున్నారని, హిందువుల పేరు చెప్పుకుని మీరు బ్రతుకుతున్నారు అంటూ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించడం గమనార్హం. అంతేకాక రాష్ట్రంలో స్వామిజిలు ఉన్నారని. . వారిలో చిన్న జీయర్, పొట్టి జీయర్, లావు. . . . .అంటూ హేళన చేసిన పైగా అయ్యన్న వ్యాఖ్యలకు

అతని అనుచరులు పగలబడి నవ్వడం విచారకరం అన్నారు. గురువారం రామతీర్ధాలు క్షేత్రం లోని బోడికొండ వద్ద గురువారం వాళ్ళ పార్టీ సభ్యులు నిర్వహించిన నిరసనలో అయ్యన్న ఈ వ్యాఖ్యలు చేసారు. 

అయ్యన్న మంత్రిగా ఉన్న సమయంలో ఎంతమంది జీయర్ స్వాములకు దేవాలయాల నుంచి ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలన్నారు. పీఠాధిపతులు ఎలా

వ్యవహరించాలో ఇలాంటి రాజకీయ నేతలు చెప్పవలసిన అవసరం లేదన్నారు. రాజకీయ పార్టీల విమర్శల్లోకి జీయర్లను లాగడం విజ్ఞత అనిపించోకోదన్నారు.  

ధర్మ రక్షణ కోసం మాత్రమే వేదపాఠశాలలు, గోశాలలు, విద్యాసంస్థలు ఉచితంగా నిర్వహిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న జీయర్ స్వాములను కించపరుస్తూ వ్యాఖ్యానించడం

సరికాదన్నారు. వీళ్ళ ఆశ్రమాల నిర్వహణకు రాష్ట్రంలోని ఏ దేవాలయం నుంచి నిధులు ఇవ్వరనే విషయం మంత్రి హోదాలో పనిచేసిన అయ్యన్నకు తెలియదా అని ప్రశ్నించారు.     

రామతీర్ధం లో జరిగిన ఘటనపై జీయర్ పీఠాధిపతులు ఏంతో ఆవేదనకు గురయ్యారని, ఘటనపై సంబంధిత అధికారులతో ఆనాడే చర్చించి విషయం తెలుసుకున్నారన్నారు. ప్రముఖ

ఆధ్యాత్మికవేత్త, ఉభయ వేదాంత ఆచార్య పీఠాధిపతులు చిన్న జీయర్ స్వామి ఆదేశం మేరకు, వారి శిష్యులు అహోబిల జీయర్ స్వామి బుధవారమే రామతీర్ధం క్షేత్రాన్ని ప్రత్యక్షంగా సందర్శించారన్నారు.  

జీయర్ స్వామి బుధవారం పర్యటించిన విషయం తెలుసుకోకుండానే అయ్యన్న పాత్రుడు గురువారం నిరసన సభలో నోటికివచ్చిన వ్యాఖ్యలు చేయడం

సిగ్గుచేటన్నారు. వివరాలను తెలుసుకునేందు ప్రత్యక్షంగా వచ్చిన జీయర్ స్వాములపై ఘాటైన విమర్శలు చెయ్యడం మాట్లాడడం బాధాకరం అన్నారు. 

శ్రీవైష్ణవ పీఠాధిపతులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు తక్షణం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. 

కొసమెరుపు : అయ్యన్న ఈ అనుచిత

వ్యాఖ్యలు చేసిన సమయంలో విజయనగరం రాజా వంశీకులు అదితి జగపతి, బొబ్బిలి సంస్థానాధిపతులు ఆర్ వి ఎస్ కె కె రంగ రావు (బేబినాయన) తదితరులు అదే వేదిక పై ఉండడం గమనార్హం.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam