DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రామతీర్థ దుశ్చర్యను రాముడు క్షమించినా హనుమ క్షమించడు

*సమాజాన్ని పీడిస్తున్న చీడపురుగులను శిక్షించాల్సిందే.* 

*హైందవ సమాజం మొత్తం ఏకమవ్వవలసిన తరుణం.*

*రామతీర్థ ఘటనపై రంగ రామానుజ జీయర్ స్వామి ఆవేదన* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జనవరి 01, 2021  (డి ఎన్ ఎస్):* రామతీర్ధ క్షేత్రం కొండపై జరిగిన

రామాలయ విగ్రహాన్నీ ధ్వంసం చేసిన ఘటనను శ్రీరాముడు క్షమించినా, హనుమంతుడు క్షమించడని శ్రీమత్ ఉపనిషత్ సిద్ధాంత ఆచార్య పీఠాధిపతులు (కాకినాడ) త్రిదండి రంగరామానుజ జీయర్ స్వామి తెలియచేసారు. శుక్రవారం రామతీర్థ క్షేత్రంలోని బోడకొండ ను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా అయన ఆవేదన తప్త హృదయంతో భక్తులకు సూచన చేశారు. ఉత్తరాంధ్ర

అయోధ్యగా పేరు పొందిన విజయనగరం జిల్లా రామతీర్థ క్షేత్రానికి ఎంతో వైభవం ఉందని, ఈ ఘటన ఒక మార్పు కు హెచ్చరికగా అభివర్ణించారు. హైందవ సమాజంపై జరుగుతున్న ఘటనల నేపథ్యంలో యావత్ హైందవ సమాజం మొత్తం ఏకం కావలసిన తరుణమిది అన్నారు. 

మతిస్థిమితం లేని వాళ్ళు చేసి ఉంటె. . . అంతదూరం కొండెక్కి, కేవలం ఒక్క విగ్రహం లోని, ఒక

నిర్దిష్ట భాగం పైనే ఎలా దాడి చేస్తారన్నారు. 

ఇంట్లోని వస్తువులను పట్టిన చెదపురుగులని శిక్షించక పొతే మొత్తం ఇల్లంతా ఎలా ప్రాకుతుందో. .. అదే విధంగా హైందవ సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఈ చీడపురుగులను  కచ్చితంగా శిక్షించాల్సిందే. . . అన్నారు. మా చిన్నతనం లో దర్శించిన అమృత మూర్తి ని, భిన్నంగా చూడలేమని, కొండా

ఎక్కడం లేదన్నారు. కొండపాద భాగం లోనే నిలిచి స్వామికి మంగళాశాసనం చేసారు. 

అంతకు ముందు స్వామి, ప్రధాన క్షేత్ర దర్శనం చేసుకుని, జరిగిన ఘటనను విచారించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam