DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హిందువులకు న్యూ ఇయర్ గిఫ్ట్, మరో విగ్రహం ధ్వంసం

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, జనవరి 01, 2020  (డి ఎన్ ఎస్):* ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పిచ్చెక్కిన మతోన్మాద మతిస్థిమితం లేని హిందూ వ్యతిరేక ద్రోహులు హిందువులకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చారని, కమలానందభారతి స్వామి ఆవేదన వ్యక్తం చేసారు. తూర్పు గోదావరి జిల్లాలోని

రాజమహేంద్రవరం లోని శ్రీరామ్ నగర్ లోని శ్రీ సంకష్టహర విఘ్నేశ్వరస్వామి ఆలయమునందు శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయముపై గురువారం రాత్రి దాడి చేసి, విగ్రహం చేతులు, కాళ్ళు ధ్వంసం చేశారన్నారు. ఘటన విషయం తెలుసుకున్న ఆయన స్వామి ఆలయానికి చేరుకొని పరిశీలన చేసారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి రోజూ ఒక హిందూ దేవాలయంలో దాడులు

జరుగుతున్నా, ప్రభుత్వం కళ్ళుమూసుకు పోయిందన్నారు. హిందూ ధర్మాన్ని భిన్నం చేసేందుకు ఒక ముఠా తిరుగుతోందని, దానికి పాలకుల సహకారం లేకుంటే. . వాళ్ళు కచ్చితంగా దొరికేవారేనన్నారు. విజయనగరం జిల్లా రామతీర్ధం కొండపై శ్రీరాముని విగ్రహం పై దాడి చేసి భౌతికంగా దాడి చేసి, విగ్రహం పై భాగాన్ని కొండకిందకు విసిరేశారన్నారు. ఇది

జరిగి 5 రోజులు గడుస్తున్నా ఆతీ గతీ లేదన్నారు. గత 20 నెలల ప్రస్తుత ప్రభుత్వ పాలనలో సుమారు 20 దేవాలయాలు పూర్తిగా ధ్వంసం చేశారన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేనందున కేవలం హిందువులను ఓటు బ్యాంకు గానే చూస్తున్న ఈ పాలకులకు సమయం దగ్గర పడిందన్నారు. కుట్రపూరితంగా మత విద్వేషాలు రెచ్చగొట్టి తద్వారా హిందువులను

కొపోదృక్తులను చేసి ప్రపంచానికి భారతీయ హిందువులను ఉగ్రవాదులుగా చిత్రీకరించడానికి ఒకపథకం ప్రకారం కుట్రజరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసారు.  

దీనిపై  కేంద్ర ప్రభుత్వ హోంశాఖ #NIA కి అప్పగించి బాద్యులను ఉరితియ్యాలని, పీనల్ కోడ్ సెక్షన్లు 302, 307 హిందూ దేవాలయాలపై దాడి చేసిన వారిపై అమలుచేయాలని దేవాలయాలపై

జరిగిన  దాడులపై పోలీస్ శాఖ డాగ్స్, క్లూస్ టీమ్ లను  వినియోగించుకునే విధంగా ఆదేశాలు జారీచేయాలని లేదంటే హిందువులే చట్టాన్ని తమచేతుల్లోకి తీసుకుంటే పరిస్థితులు దారుణంగా ఉంటాయని హెచ్చరించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam