DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లారీలు కాదు, జగన్ రెడ్డే పడుకున్న. .డోంట్ కేర్: ట్విట్టర్ లో లోకేష్

*రామతీర్ధం వెళ్తున్న చంద్రబాబు కాన్వాయ్ కు అడ్డుగా లారీలు*

*టీడీపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్న పొలిసు, వైకాపా శ్రేణులు*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జనవరి 02, 2021 (డిఎన్ఎస్):* విజయనగరం జిల్లా రామతీర్ధంలో జరిగిన ఘటనను పరిశీలించేందుకు వెళ్తున్న

ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కాన్వాయ్ కు అడ్డుగా లారీలు పెట్టడం కాదని, సీఎం జగన్ మోహన్ రెడ్డి వచ్చినా ఖాతరు చేసేది లేదని, ఎమ్మెల్సీ లోకేష్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. ట్విట్టర్ వేదికగా అయన మండిపడ్డారు. శనివారం ఉత్తరాంధ్ర అయోధ్య రామతీర్ధం కు వెళ్తున్న చంద్రబాబు కు అడుగడుగునా అధికార పార్టీ అడ్డంకులు

పెట్టిందన్నారు. పోలీస్ యంత్రాంగం సైతం అధికార పార్టీ కార్యకర్తలుగా మారిపోయారని మండిపడ్డారు. బాబు వాహనానికి అడ్డంగా అధికార పార్టీ కి  లారీలు పెట్టడంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. సుమారు గంట సేపు నిరోధించడంతో పొలిసు అధికారులపై చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చెయ్యడం తో అయన వాహనాన్ని మాత్రమే రామతీర్ధం కు పంపి,

మిగిలిన వాహనాలను మాత్రం అడ్డుకున్నారు. 

హిందూ ధర్మం పై జరుగుతున్న దాడిని అడ్డుకోలేని, విగ్రహాల ధ్వంసాన్ని అడ్డుకోలేని ముఖ్యమంత్రి వైఎస్ జగన్, పోలీసులు కలిసి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకోవడానికి లారీలు అడ్డంగా పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం

ఉందా?ప్రతిపక్ష నేత బయటకి వెళ్లకుండా గేటుకి తాళ్ళు కడతారు.ఇప్పుడు ఏకంగా లారీలు అడ్డంగా పెట్టారు.ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగానికి అడ్డు, అదుపు లేదన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam