DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సర్వే, ఇంజనీరింగ్ సిబ్బందికి సహకారం అందించాలి

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, జనవరి 04, 2020  (డి ఎన్ ఎస్):* గత 25 ఏళ్ళ నుంచి టౌన్ ప్లానింగ్ సిబ్బందికి, ప్రజలకు అనుసంధానంగా ఉండి సేవలు అందిస్తున్న లైసెన్సుడు సర్వేయర్సు, ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్ సిబ్బందికి ప్రభుత్వం నుంచి తగిన సహకారం అందించాలని తూర్పు గోదావరి జిల్లాలోని ది

రాజమహేంద్రవరం లైసెన్సుడు సర్వేయర్సు, ఇంజనీర్స్, ఆర్కిటెక్ట్ సంఘం అధ్యక్షులు టివిఎల్ నరసింహారావు కోరుతున్నారు. రజతోత్సవ సందర్బంగా సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ ఎల్ ఆర్ ఎస్, బి పి ఎస్ విధానాలకు తమ సంఘం నుంచి సంపూర్ణంగా సహకారం అందిస్తున్నారమన్నారు. ఈ సందర్బంగా ఎల్ టి పి సంఘం కమ్యూనిటీ

బిల్డింగ్ నిమిత్తం స్థలం కేటాయించడానికి, ఆర్ధికంగా వెనకబడి ఉన్న ఎల్ టి పి సభ్యులకు సబ్సిడీ ధరపై స్థలములు కేటాయించాలని, ఎల్ ఆర్ ఎస్ స్కీం గడువు ను పెంచడం ద్వారా ప్రజలకు మరింత వెసులుబాటుగా ఉంటుందని, జీవో 119 లోని అనెక్సార్ 3 నుంచి ఎల్ టి పి ల భాద్యత తొలగించాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు.   

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam