DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విగ్రహ ధ్వంసం తో హిందువుల మనోభావాలు దెబ్బ తిన్నాయి

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, జనవరి 04, 2020  (డి ఎన్ ఎస్):*  నాలుగు వందల సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన ఆలయం రామతీర్ధం దేవాలయం వైభవానికి భంగం కల్గించిన ఘటన ద్వారా హిందువుల మనోభావాలు దెబ్బ తిన్నాయని బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షులు సోము వీర్రాజు మండిపడ్డారు. సోమవారం మాట్లాడుతూ ఈ

ఘటనపై ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీ లు రాజకీయం చేయడాన్ని తప్పుపట్టారు. శ్రీరామ చంద్రుడు సంచరించిన ప్రదేశంగా ఉన్న ఆలయంలో విగ్రహం ధ్వంసం తో హిందువుల మనోభావాలు దెబ్బ తిన్నాయన్నారు. శ్రీరామ చంద్రునికి జరిగిన అపచారాన్ని దేశ ప్రజలంతా ఖండించే పరిస్థితి ఉందన్నారు. 
ముఖ్యమంత్రి సీఐడీకి ఇవ్వాలని చెబుతున్నారఅని, అయితే

 ఆది నుంచి నిర్లక్ష్యం కనిపిస్తుందన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రభుత్వం సరిగా స్పందించడం లేదన్నారు. పిఠాపురం, అంతర్వేది వంటి ఘటనల నుంచి నేటి వరకు ఇదే పరిస్థితి నెలకొందన్నారు. గత ప్రభుత్వ హయాంలో కూలగొట్టిన ఆలయాలను కూడా ఈ ప్రభుత్వం పునర్నిర్మాణం చేయలేదన్నారు. అంటే హిందూ ధార్మిక విధానంపై, హిందూ

ధర్మంపై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని తెలిపారు. రాష్ట్రంలో వైయస్ విగ్రహాలు పెట్టిన ప్రభుత్వం,  హిందూ దేవుళ్ల విగ్రహాలను ఎందుకు పెట్టడంలేదన్నారు.  మంగళవారం రామతీర్దాన్ని సందర్శించేందుకు బీజేపీ, జనసేన సంయుక్తంగా యాత్ర చేపడుతున్నాం అని తెలిపారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని రాష్ట్ర

వ్యాప్తంగా నిర్మాణం చేస్తాం అన్నారు. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల హయాంలో హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా చేస్తున్నారని మండిపడ్డారు. హిందువులను చిన్నచూపు చూసే వైఖరిని ఆమోదించదు అనే వైఖరిని ప్రజల్లోకి తీసుకెళతాం అన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam