DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కట్టుదిట్ట ఏర్పాట్ల మధ్య విశాఖలో వాక్సిన్ ప్రారంభం

*తొలి టీకా విశాఖ లో ఆశ కార్యకర్త సాయిలక్ష్మి కి.*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జనవరి 16, 2021  (డి ఎన్ ఎస్):* ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలిచిన భారత దేశ శాస్త్రవేత్తల ఆవిష్కరణ కోవిడ్ వాక్సిన్ శనివారం దేశవ్యాప్తంగా మొదలైంది. విశాఖనగరం జిల్లా కలెక్టర్ వినయ్

చాంద్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఎంపిక చేసిన ప్రభుత్వ సిబ్బందికి తొలివిడత వాక్సిన్ ను అందించారు. విశాఖలో కోవిడ్ -19 తొలి టీకా ను చిన వాల్తేర్ లో ఆశ వర్కర్ గా సేవలు అందిస్తున్న ఏ సాయి లక్ష్మీ కి అందించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వినయ్ చాంద్ మీడియా తో మాట్లాడుతూ 25 వరకు రెండో దశ టీకా గ్రహీతలు పేర్లు నమోదు చేస్తున్నామని,

రెవిన్యూ, పారిశుధ్య, వైద్య సిబ్బంది రెండో దశ టీకా కార్యక్రమం ఉంటుందన్నారు. మొదటి ఐదు రోజులు పరిమితి  సంఖ్య లో టీకా వేసే ప్రక్రియ చేయాలని ఆదేశించారు. 24 అర్బన్ ప్రాధమిక వైద్య సేవాకేంద్రాలలో ఈ టీకా కార్యక్రమం జరుగుతుందని తెలియచేసారు. ప్రతి ఒక్కరికి టీకా వేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎవ్వరికి అవసరం ఉందొ ముందు

వారికి టీకా వేసే ప్రక్రియ చేస్తున్నామని, కోవిషీల్డ్ టీకాను 28 రోజులు తరవాత కూడా రెండో డోస్ స్వీకరించాలని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా నగర ,జిల్లా పోలీస్ సమన్వయ విధులు నిర్వహిస్తారన్నారు. టీకా వచ్చినప్పటికి మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్ర పరచుకోవడం చేయాలని

తెలిపారు. 

నర్సీపట్నం లో: . . . 

నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో మొదటి వ్యాక్సిన్ ను ఐసిటిసి (Integrated Counselling and Testing Centres ) కౌన్సిలర్ డిపి చంద్రశేఖర్ వేయించుకున్నారు. నర్సీపట్నం అసెంబ్లీ నియోజక వర్గానికి  సంబంధించి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి, నాతవరం పీ హెచ్ సి లకు ప్రత్యేక అధికారి గా వ్యవహరిస్తున్న  సబ్

కలెక్టరు ఎన్ మౌర్య అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు జరక్కుండా చూడాల్సిందిగా వైద్య అధికారులకు సూచించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam