DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రామ మందిర నిర్మాణానికి డిజిపి గౌతమ్ సైతం విరాళం

*బీజేపీ నేత పురిగళ్ల రఘు, ఇతర రామ సేవకులకు అభినందనలు*

*గ్రామగ్రామాన విస్తృత ప్రచారం, మందిరం మన అందరిదీ, పురిగాళ్ల రఘు*
 
*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జనవరి 20, 2021  (డి ఎన్ ఎస్):* అయోధ్యలోని భవ్య రాముని మందిర నిర్మాణానికి తనవంతు భాగస్వామ్యంగా ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ విరాళాన్ని అందించారు. మంగళవారం తనని కలిసిన బీజేపీ నేత పురిగాళ్ల రఘు, ఇతర ఆర్ ఎస్ ఎస్, రామసేవకుల బృందాన్ని ఆయన అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లిల్లు తిరుగుతూ అందరిలోనూ చైతన్యాన్ని కల్గిస్తూ, ఒక మంచి కార్యక్రమం లో ప్రజలందరినీ భాగస్వాముల్ని చేస్తున్నారన్నారు. ఈ మహాయజ్ఞం లో తనుకూడా

పాల్గొంటానని, తన విరాళాన్నీ చెక్ ద్వారా ఈ బృందానికి అందించారు. పురిగాళ్ల రఘు డిజిపి కి తాము నిర్వహిస్తున్న కార్యాచరణ, ప్రచారం, నిధుల సేకరణకు తీసుకునే జాగ్రత్తలు తెలియచేసారు. కోట్లాది మంది హిందువుల చిరకాల వాంఛ అయోధ్య లో రామ మందిరం, అని, ఇది మన అందరి మందిరమనీ, ఒక్క రూపాయి నుంచి అవకాశం ఉన్నంతవరకూ నేరుగా ట్రస్ట్

బ్యాంకు ఖాతాకు అందించవలసిందిగా ట్రస్ట్ పిలుపు ఇచ్చిందన్నారు. ఎందరో పారిశ్రామికవేత్తలు, మందిరాన్ని తామే పూర్తిగా నిర్మిస్తామని ప్రకటించినా, నిర్మాణంలో ప్రజలందరి భాగస్వామ్యం ఉండాలని, ఈ ఆలయం ఏ ఒక్కరికో సొంతం కాకూడదని, అందుకే ప్రజలందరినీ భాగస్వాముల్ని చేస్తున్నామని తెలిపారు. ఇది కేవలం కొంత గడువు వరకు మాత్రమే

సేకరణ జరుగుతుందని, ఈ నిధులన్నీ నేరుగా అయోధ్య రామ మందిర నిర్మాణ బ్యాంకు ఖాతాలోకే వెళ్తాయని తెలిపారు. నిధులను డబ్బుల రూపంలో ఇచ్చే వారికి కూపన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. కచ్చితంగా ప్రతి ఒక్కరికి అయోధ్య రామ మందిర కమిటీ ధృవీకరించిన రసీదులనే ఇవ్వడం జరుగుతుందని వివరించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam