DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రోడ్ల మరమ్మతులకు వెయ్యి కోట్లు అనుమతి ఇచ్చాం

*ఇప్పడికే రోడ్ల మరమ్మత్తు కు రూ. 1500 కోట్లు ఖర్చు చేసాం* 

*రూ. 3 వేల కోట్లు ఆర్టీసీ నిధులు ప్రక్కదారి పట్టించారు* 

*రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ వెల్లడి*

*(DNS రిపోర్ట్ :  సత్య గణేష్ BVS , స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జనవరి 20, 2021  (డి ఎన్ ఎస్):* రాష్ట్రం లో రోడ్ల

మరమ్మతులకు వెయ్యి కోట్లు అనుమతి ఇచ్చామని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ తెలిపారు. బుధవారం విశాఖలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని నాలుగు విభాగాలుగా చేసుకుని ప్రాంతీయ సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. మొదటి సమావేశం ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు కలిపి

విశాఖలో ఏర్పాటు చేసామని, వర్షాలు కురవడం వల్ల కొన్ని చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయని, ఈ విషయాలు పై సీఎం తో మాట్లాడి రోడ్ల పునరాభివృద్ధి చేస్తున్నామని తెలియచేసారు. మార్చి నెలాఖరు లోపు మరమ్మత్తులు పూర్తి చేయాలని నిర్ణయించామని, రూ. 450 కోట్ల బకాయిలు చెల్లింపు చేయడానికి నిర్దేశించామన్నారు. నివర్ తుఫాన్ వల్ల నష్ట పోయిన

ప్రాంతాలకు 200 కోట్లు నిర్దేశించామని వివరించారు. 

రూ. 3 వేల కోట్లు ఆర్టీసీ నిధులు ప్రక్కదారి. .. 

గత పాలకులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖా నిధులను రూ. 3 వేల కోట్లు పక్కదారి పట్టించాయని, మంత్రి శంకర నారాయణ తెలిపారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ. 6 వేల కోట్ల ఎన్డిపి

ప్రాజెక్టు ఇచ్చామని, రూ. 1150 కోట్లు నాబార్డ్ ద్వారా నిధులు వస్తున్నాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రతి ప్రాంతానికి రోడ్ సౌకర్యం కల్పించడానికి వేస్తున్నామన్నారు. విశాఖ సుందరికరణకు రోడ్ల అభివృద్ధికి నిధులు అందిస్తున్నామని వివరించారు. ఇప్పడికే రోడ్ల మరమ్మత్తు కు రూ. 1500 కోట్లు ఖర్చు చేయడం

జరిగిందన్నారు. 

రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా ముఖ్య కార్యదర్శి ఎం టి కృష్ణబాబు మాట్లాడుతూ విశాఖ జిల్లా పరిధిలో పెందుర్తి కొత్తవలస కు ఐదు కోట్లు నిధులు ఇచ్చామని, పెందుర్తి నుంచి భోడారా కూడలి జాతీయ రహదారి గా మార్చడానికి ప్రతిపాదనలు పంపామన్నారు. షీలా నగర్ నుంచి సబ్బవరం 12 కిలోమీటర్లు రహదారి నిధులు కూడా మంజూరు

చేసామని, దానికి  స్థల సేకరణ పూర్తి చేయాల్సివుందన్నారు. బీచ్ డ్రైవ్ లా... నేషనల్ హై వే నుంచి గొస్తని నదిపై ఒక బ్రిడ్జి నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. రూ. 60 లక్షలు పెట్టి బిమిలి నుంచి భోగాపురం వరకు ఐ అండ్ ఐ అనే సంస్థ డిపిఆర్ తయారు చేశారని, రూ. 9500 కోట్ల ప్రాజెక్టులు భూ సమీకరణ వల్ల ఆగిపోయాయని తెలిపారు. 
/> అనకాపల్లి  ఆనందపురం జాతీయ రహదారి 52 కిలోమీటర్లు ....మూడు కిలోమీటర్లు మినహా పనులు పూర్తి ఐయ్యాయని, ఆ మూడు కిలోమీటర్లు భూ పరమైన సమస్యలు పరిష్కారం అవుతున్నాయన్నారు. విజయనగరం నుంచి పాడేరు కలుపుతూ రాజమండ్రి వరకు ఒక రహదారి,  విశాఖ నుంచి రాయపూర్ కి మరో రహదారి నిర్మాణం ప్రణాళిక సిద్ధం చేసామని వివరించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam