DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఒంటిమిట్టకు చేరిన చిన్న జీయర్ స్వామి ధర్మ దీక్ష

*మతాలకు అతీతంగా భక్తులు సైతం స్వామి వెంట యాత్రలో* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జనవరి 20, 2021  (డి ఎన్ ఎస్):* హిందూ దేవాలయాలతో పాటు, ధార్మిక సంప్రదాయ పరి రక్షణ లో ప్రతి ఒక్కరూ భాద్యత వహించాలని, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, అపర భగవద్రామానుజులు, ఉభయ వేదాంత ఆచార్య

పీఠాధిపతులు, త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి సూచించారు. రాష్ట్రంలో జరుగుతున్న హిందూ దేవీదేవతలు విగ్రహాల ధ్వంసం ద్వారా నిస్సహాయ స్థితిలో ఉన్న హిందూ సమాజాన్ని చైతన్యపరిచేందుకు స్వామిజి చేపట్టిన రాష్ట్రవ్యాప్త ఆలయాల సందర్శన యజ్ఞం భాగంగా బుధవారం స్వామిజి కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ సీతారామచంద్ర

స్వామి ఆలయానికి చేరుకుంది. ఆలయంలోని ప్రాముఖ్యత ఉన్న ప్రాంతాలను, ఆలయంలోని కోనేరు పరిశీలించారు. 
 
ఈనెల 16 న కర్నూలు జిల్లా మంత్రాలయం లో మొదలైన యాత్ర ఐదవరోజు యాత్ర ప్రత్యేకత సంతరించుకుంది. కడప జిల్లా లోని సిద్దవటం లోని శ్రీరంగనాధ స్వామి ఆలయం సందర్శన అనంతరం ఒంటిమిట్ట లో సమావేశం ముగించుకుని స్వామి నందలూరు లోని

శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయానికి చేరుకున్నారు. 

హిందూ ధర్మ రక్షణ కోసం జరుగుతున్నా ఈ యాత్ర గురించి తెలుసుకున్న స్థానిక ముస్లిం సంప్రదాయపరులు పెద్దసంఖ్యలో ఆలయానికి చేరుకొని స్వామి మంగళశాసనములు అందుకున్నారు. వారితో స్వామిజి పలు సూచనలు చేసారు. అనంతరం భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేసారు. 

ఈ యాత్ర లో

చిన్న జీయర్ స్వామి వెంట త్రిదండి అహోబిల జీయర్ స్వామి, ఇతర శిష్య బృందం పాల్గొన్నారు.

(Photos courtesy:  Lakshmi Ramanujadasi)

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam