DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విగ్రహానికి మలం పూసారంటూ ఫేక్ న్యూస్ పై ఇద్దరి అరెస్ట్

*తప్పుడు ప్రచారంపై రాజమండ్రి పోలీసుల హెచ్చరికలు* 

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, జనవరి 20, 2021  (డి ఎన్ ఎస్):* తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని పిడింగొయ్యి ప్రాంతంలో ఒక విగ్రహంపై మలం పూశారంటూ వార్తలు ప్రచారం చేసిన ఘటనలో ఇద్దరినీ అరెస్ట్ చేసినట్టు రాజమహేంద్రవరం

అర్బన్ జిల్లా ఎస్.పి డా . షీముషి బాజ్ పాయ్ ఓ ప్రకటనలో తెలిపారు. మత సామరస్యానికి విఘాతం కలిగించే విధంగా అసత్య ప్రచారాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసి మతాల మధ్య గొడవలు సృష్టించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. బొమ్మురు పోలీస్ స్టేషన్ పరిధిలో పిడింగొయ్య గ్రామం లో గత ఏడాది సెప్టెంబర్  11. న

 అర్ధరాత్రి సమయములో వినాయక విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు మానవ విసర్జితం పూసిన సంఘటన పై Cr.No.672 / 2020 కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగిందని తెలిపారు. దర్యాప్తులో భాగంగా మలం సాంపిల్స్ ను రసాయనిక పరీక్షల నిమిత్తం FSL మంగళగిరి కి పంపించగా, అది మానవ విసర్జితం కాదు అని నివేదిక వచ్చినది. దీంతో ఈ ఘటన పై సోషల్ మీడియా

ద్వారా అసత్య ప్రచారం చేస్తూ ప్రజల యొక్క మత విశ్వాసాల కు భంగం కలిగించి, ప్రజల మధ్య విద్వేషాన్ని రగిలిస్తూ విభేదాలు సృష్టించిన వల్లెపల్లి ప్రసాద్ బాబు ను జనవరి 15 న అరెస్ట్ చేయగా, చిటికిన సందీప్ ను జనవరి 19 న అరెస్టు చేసి రిమాండ్ కి తరలించినట్టు తెలిపారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam