DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డోర్ డెలివరీ వాహనాలు ప్రారంభం

*విజయవాడ లో సీఎం, జిల్లాల్లో మంత్రులు ప్రారంభం* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జనవరి 21, 2021  (డి ఎన్ ఎస్):* ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం పౌరసరఫరాలశాఖ కొత్త వాహనాలను ప్రారంభించారు.  ఈ ఉదయం కృష్ణా, గుంటూరు, పశ్చిమ

గోదావరి జిల్లాలకు సంబంధించిన 2,500 రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాలను విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. మిగిలిన జిల్లాలకు కేటాయించిన వాహనాలను మంత్రులు ప్రారంభించారు.  నేడు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,260 వాహానాలు ప్రారంభంకానున్నాయి. ఫిబ్రవరి 1వతేదీ నుంచి నాణ్యమైన రేషన్‌ బియ్యం

డోర్‌ డెలివరీ కోసం ఈ వాహనాలు సిద్ధమయ్యాయి. లబ్ధిదారులకు నాణ్యమైన, మెరుగుపరచిన బియ్యాన్ని ఇంటివద్దే అందచేసేందుకు ఏటా రూ.830 కోట్లు అదనంగా వెచ్చిస్తూ పథకాన్ని రూపొందించారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన వివిధ కార్యక్రమాల్లో జిల్లాల్లోనూ మంత్రుల నేతృత్వంలో ఈ వాహనాలను ప్రారంభించారు. 

విశాఖపట్నం బీచ్ రోడ్

లోని ఏయు కన్వెన్షన్ హాల్ వద్ద బియ్యం పంపిణీ వాహనాలు ఓపినింగ్ కార్యక్రమంలో విశాఖ జిల్లా ఇంచార్జ్ మంత్రి వర్యులు కురసాల కన్నబాబు తదితరులు ప్రారంభించారు.  చాలా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలకు మారుగా సమన్వయకర్తలు ప్రారంభించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam