DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రామ మందిరానికి పవన్ రూ. 30 లక్షల విరాళం అందజేత

*తిరుపతిలో కలిసిన రామ మందిర ట్రస్ట్ ప్రతినిధులకు అందజేత*

*పవన్ కార్యాలయ సిబ్బంది రూ. 11 వేలు విరాళం డిడి అందజేత*  

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం/ తిరుపతి , జనవరి 22, 2021  (డి ఎన్ ఎస్):* అయోధ్య లో నిర్మితమవుతున్న కోట్లాది మంది భక్తుల చిరకాల మనోవాంఛ శ్రీ

రామ మందిర నిర్మాణానికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రూ. 30 లక్షల విరాళం ను డిడి రూపంలో అయోధ్య ట్రస్ట్ ప్రతినిధులకు అందించారు. శుక్రవారం తిరుపతిలో తనను కలిసిన రామ మందిర ట్రస్ట్ ప్రతినిధులు, మాజీ మంత్రి బీజేపీ నేత డా. కామినేని శ్రీనివాస్ తదితర ప్రతినిధులకు ఈ మొత్తాన్ని పవన్ అందించారు. శ్రీరాముడు ఏ ఒక్క వర్గానికో

భగవంతుడు కాదని, సర్వ ప్రాణి లోకానికి విస్తరించిన మహనీయుడని తెలిపారు. రామ మందిరానికి తానూ ఈ విరాళం ఇస్తున్నట్టు తెలుసుకున్న తన ఇంట్లోని కార్యాలయ సిబ్బంది సైతం తాముకూడా భాగస్వాములవుతామని, వారివంతు గా రూ. 11 వేల ను డిడి రూపంలో ఇచ్చారన్నారు. వారి తరపున ఈ డిడి ని అయోధ్య కమిటీకి తానే అందించినట్టు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ

మందిరాన్ని కేవలం కొందరు పారిశ్రామికవేత్తలు నిర్మించేయగలరని, అయితే భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, రామ మందిర కమిటీ తదితర పెద్దలు, ఈ మందిరం యావత్ భారత దేశ ప్రజలందరికి చెందిందని, దీనిలో సామాన్యుల భాగస్వామ్యం కూడా ఎంతోకొంత ఉండాలన్న సంకల్పంతో కనీసం రూ.1 నుంచి విరాళం సేకరించేందుకు దేశవ్యాప్తంగా యాత్రలు

చేస్తున్నట్టు తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam