DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సుప్రీంకోర్టులో వైసీపీ ప్రభుత్వ ఎన్నికల పిటిషన్‍ వెనక్కి

*దరఖాస్తు సరిగ్గాలేదు, సరిచేయమని ఏపీకి సుప్రీం సూచన*  

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, జనవరి 21, 2021  (డి ఎన్ ఎస్):* స్థానిక ఎన్నికల విషయంలో హైకోర్టు ఉత్తర్వులను సుప్రీం కోర్టు సవాల్ చేసిన వైసీపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ మొత్తం తప్పుల

తడకగా ఉందని, దానిని సరిచేయాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే పిటీషన్‌ను వెనక్కిచ్చేసింది. ఈ క్రమంలో మళ్లీ ఈరోజే రిజిస్ట్రీ పిటిషన్‌ను సరిచేసి దాఖలు చేయలేకపోవచ్చని వైసీపీ లాయర్లు చెబుతున్నారు. దీనివల్ల సోమవారం వరకు పిటీషన్ దాఖలు చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. అయితే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ మాత్రం ఆదివారమే

విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మళ్లీ పిటీషన్ దాఖలు చేసే అవకాశం లేనట్లేనని తెలుస్తోంది.

పంచాయతీ ఎన్నికలపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జగన్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఎన్నికలను ఆపాలని, హైకోర్టు ఉత్తర్వులు రద్దు చేయాలని సుప్రీంలో ఓ పిటిషన్ దాఖలు చేసింది. వ్యాక్సినేషన్

సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యంకాదంటూ జగన్ సర్కార్ వాదిస్తోంది. కానీ ఇప్పుడు సుప్రీంలో కూడా షాక్ తగలడంతో ఇక ఎటు వెళుతుందో వేచి చూడాలి.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam