DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తొలివిడత పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

*ప్రభుత్వ సహకారం ఉంటుందని ఆశిస్తున్నాం: ఎస్ఈసి రమేష్*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జనవరి 23, 2021  (డి ఎన్ ఎస్):* ఆంధ్రప్రదేశ్‌ లో  తొలివిడత పంచాయతీ ఎన్నికల ప్రకటనను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్ శనివారం విడుదల చేసారు. విజయవాడలోని ఎస్‌ఈసీ

కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేసారు. తొలివిడత లో విజయనగరం, ప్రకాశం జిల్లాల మినహా మిగిలిన 11 జిల్లాల్లోని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయం వస్తే తప్పకుండా

పాటిస్తామని ఎస్‌ఈసీ స్పష్టం చేశారు. రెవెన్యూ డివిజన్‌ ప్రాతిపదికగానే ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి ముందుకెళ్తున్నట్టు రమేశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు.

తొలి దశ ప్రక్రియ ఇలా..
మొదటి దశ ఎన్నికల ప్రక్రియ

శనివారమే ప్రారంభమై ఫిబ్రవరి 5న సర్పంచి, ఉపసర్పంచి ఎన్నికతో ముగుస్తుంది.
జనవరి 23: నోటిఫికేషన్‌ జారీ
* 25: అభ్యర్థులనుంచి నామినేషన్ల స్వీకరణ
* 27: నామినేషన్ల దాఖలుకు తుది గడువు
* 28: నామినేషన్ల పరిశీలన
* 29: నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన
* 30: ఈ అభ్యంతరాలపై తుది నిర్ణయం
* 31: నామినేషన్ల ఉపసంహరణకు

తుది గడువు (మధ్యాహ్నం 3 గంటల వరకు).. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల
* ఫిబ్రవరి 5: పోలింగ్‌ తేదీ (సర్పంచి ఎన్నిక కోసం ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 మధ్య పోలింగ్‌)
* పోలింగ్‌ ప్రక్రియ పూర్తయ్యాక మధ్యాహ్నం 4గంటల నుంచి ఓట్ల లెక్కింపు. ఫలితాల వెల్లడి. దీని తర్వాత ఉపసర్పంచి ఎన్నికను పూర్తి చేయటంతో మొదటి విడత

ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam