DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీలో దేవత విగ్రహాల ధ్వంసం పై కేంద్రం, బీజేపీ సీరియస్

*ఏపీ కి రాజకీయాలే ముఖ్యం, అభివృద్ధి అవసరంలేనట్టు ఉంది*

*వైఎస్ జగన్ వ్యక్తిగత ప్రతిష్ట కోసమే స్థానిక ఎన్నికల వాయిదా*

బీజేపీ పూర్వ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జనవరి 23, 2021  (డి ఎన్ ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ లో

గత రెండేళ్ల కాలం గా వరుసగా జరుగుతున్నా పలు దేవి దేవతా విగ్రహాల ధ్వంసం ఘటనలపై కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ అధిష్టానం సీరియస్ గా ఉందని బీజేపీ సీనియర్ నేత, పూర్వ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తెలిపారు. శనివారం నగరం లో జరిగిన ఓ ప్రయివేట్ కార్యక్రమం లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందూ సంప్రదాయం లో

దేవాలయాలు, దేవత విగ్రహాల ఆరాధన ఎంతో విలువైనవని, అలంటి వాటిని ధ్వంసం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉందన్నారు. 19 నెలల క్రితం జరిగిన విగ్రహాల పై దాడి ఘటనలో ఇప్పడికీ ఒక్క నిందితున్ని కూడా అరెస్ట్ చేయకపోవడమే ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. మతిస్థిమితం లేనివాళ్లు విగ్రహాలపై దాడి

చేస్తున్నారంటూ పోలీసులు ప్రకటించడం కంటి తుడుపు చర్య కాదా అని ప్రశ్నించారు.  

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వానికి రాజకీయాలే ముఖ్యం గా ఉన్నాయని, అభివృద్ధి అవసరంలేనట్టు ఉందని రామ్ మాధవ్ ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక ఏపీ లోకి ఒక్క పరిశ్రమ కూడా పెట్టుబడులు

పెట్టేందుకు రాలేదని, పైగా ఇంతకూ ముందు పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన సంస్థలు కూడా గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, తదితర రాష్ట్రాలకు తరలిపోతున్నాయన్నారు. 

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత ప్రతిష్ట కోసమే పంచాయితీ ఎన్నికల వాయిదాను కోరుకుంటున్నారన్నారు. ప్రజాస్వామ్య పరిపాలనలో చట్టప్రకారం ఎన్నికల కమిషన్

కు అత్యున్నత అధికారం ఉంటుందని, ఒకసారి ఎన్నికల ప్రకటన వెల్లడించిన తదుపరి, ఎన్నికల కమిషనర్ కె అధికార నిర్ణయం మెండుగా ఉంటుందన్నారు. ఎన్నికలు నిర్వహించాలా లేదా అనేది కేవలం ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాత్రమే తీసుకునే నిర్ణయం అన్నారు. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తలదూర్చకూడదన్నారు. వారికి

ఏమాత్రం సంబంధం ఉండదన్నారు. అందరూ సమన్వయము తో నిర్వహించవలసిన కార్యాచరణ ఇది అన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam