DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చిన్న జీయర్ ఆశ్రమం ద్వారా రామ మందిరానికి 16 కోట్లు విరాళం

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జనవరి 23, 2021  (డి ఎన్ ఎస్):* కోట్లాది మంది హిందువులేకాక, ఇతరులు సైతం అభిమానించే ఆదర్శమూర్తి శ్రీ రామ చంద్రుని అయోధ్యలో నిర్మితమవుతున్న మందిరానికి చిన్న జీయర్ స్వామి ఆశ్రమం ద్వారా భక్తులు సుమారు రూ. 16 కోట్లకు పైగా విరాళాన్ని అందించారు.

అయోధ్య శ్రీ రామ మందిరానికి దేశవ్యాప్త విరాళం సేకరణ భాగంగా, ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి 2021 జనవరి 22 న జివా క్యాంపస్‌లో శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామీజీని సందర్శించారు.

అయోధ్య కమిటీ ప్రతినిధులు హైద్రాబాద్ లోని చిన్న జీయర్ స్వామి ఆశ్రమం జీవా కు వచ్చిన సందర్భంగా సామాన్య భక్తుల నుంచి

అసామాన్యులు వరకూ స్వచ్చందంగా వారికి తోచిన నిధులను స్వయంగా కమిటీకి అందించారు.     

రాముని మందిరానికి మనవంతు భాగస్వామ్యం పొందుదాం అంటూ చిన్న జీయర్ స్వామి ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆశ్రమానికి వచ్చి, నేరుగా కమిటీ కె విరాళాలను అందించారు.  ఈ పర్యటనలో భాగంగా భయ్యాజీ ఆధ్యాత్మిక అద్భుత

కేంద్రం (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ - భగవద్రామానుజులు) ని  కూడా సందర్శించారు. 

దశాబ్దాలుగా శ్రీ చిన్న జీయార్ స్వామీవారు ప్రతిరోజూ ఆ శ్రీరామచంద్ర మూర్తినే ఆరాధిస్తున్నారు. స్వామీజీ శ్రీ వాల్మీకి రామాయణం వందల సార్లు జపించారు. స్వామి వారు  ప్రతి సంవత్సరం లక్షలాది మందికి శ్రీ రామచంద్రుని  చరిత్రపై లోతైన

ఉపన్యాసాలు ఇచ్చారు.
జీయర్ స్వామి వారి పీఠంలో నిత్యం ఆరాధనలు అందుకునే మూర్తులు శ్రీ సీతారామచంద్ర స్వామీ కావడం గమనార్హం. 

తమ ఆచార్య, పెద్ద జీయర్ స్వామీజీ దేశవ్యాప్తంగా 108 ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాల్లో 108 కి పైగా శ్రీ రామ స్థూపాలను మహా యాగాలు చేసి ప్రతిష్ఠా చేసారు. వాటిలో ఒకటి తిరుమల క్షేత్రం లోను,

సింహాచలం లోనూ, శ్రీ కూర్మం లోనూ కూడా ఉన్నాయి. వీటి నిర్వహణ కోసం ప్రతి భక్తులు శ్రీరామ అని రాసి, ఒక రూపాయి విరాళం ద్వారా, ఒక ఇటుకను సమర్పించారని,  చిన్న జీయర్ స్వామీజీ గుర్తు చేసుకున్నారు. 

శుక్రవారం స్వామిజి ఆశ్రమం ద్వారా అయోధ్య కమిటీ కి అందిన విరాళం ఇప్పడి వరకూ  (22 జనవరి 2021 ) మొత్తం రూ.15,75,21,287 మరియు ఇంకా

లెక్కింపు జరుగుతోంది. ఈ నిధుల్లో మై హోమ్ అధిపతి జూపల్లి రామేశ్వరావు రూ. 5 కోట్లు ఇవ్వగా, మేఘ సంస్థల ప్రతినిధులు రూ. 6 కోట్లు విరాళం ఇచ్చినట్టు సమాచారం. స్వామిజి శిష్యులు వేదవిద్యార్థులు సైతం తమవంతు విరాళాన్ని సభక్తి పూర్వకంగా సమర్పించారు. విరాళాలు ఇచ్చిన వారిలో కొన్ని వివరాలు : 

కృష్ణా రెడ్డి - మేఘ

ఇంజనీరింగ్ గ్రూప్ : రూ. 6 కోట్లు 
జూపల్లి రామేశ్వర్ రావు - మై హోమ్ సంస్థ : రూ. 5 కోట్లు 
అపర్ణ కన స్ట్రక్షన్స్  రూ. 2 కోట్లు 
రెడ్డి లాబ్స్ రూ. 1 కోటి, 
భాస్కర్ -  కావేరి సీడ్స్  రూ. 51 లక్షలు 
సునీల్ - రూ. 11 లక్షలు 
జయశ్రీ - రూ. 5 లక్షలు  
కొందరు భక్తులు - రూ. 3.5 లక్షలు
వెంకటరెడ్డి - రూ. 1 లక్ష 
వి ఎస్ ఎన్

రెడ్డి - రూ. 1 లక్ష 
ఆర్. నర్సయ్య - రూ. 1 లక్ష 
వాసుదేవ్ రావు - రూ. 1 లక్ష 
ఇతర భక్తులు - రూ. 1 లక్ష 
జీయర్ ఆసుపత్రి ( జిమ్సు )రూ.  71,171 .

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam