DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జై శ్రీరామ్ నినాదాలతో మారు మ్రోగిన బాలయ్య శాస్త్రి లే అవుట్

విశాఖ వీధుల్లో శ్రీరామ ధ్వజాలతో  వైభవంగా అయోధ్య శోభాయాత్ర*

*శ్రీరాముని అయోధ్య మందిరం మన అందరిదీ: మాజీ ఎమ్మెల్యే విష్ణు*  

*శ్రీరాముని వెంటే మేముంటాం: బిజెవైఎం నగరాధ్యక్షుడు ఫణి* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జనవరి 24, 2021  (డి ఎన్ ఎస్):*

కోట్లాది మంది హిందువుల మనోవాంఛ అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం సాకారం చేసేందుకు దేశవ్యాప్తంగా శ్రీరామ శోభాయాత్రలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఆదివారం సాయంత్రం విశాఖ నగరంలోని బాలయ్య శాస్త్రి లే అవుట్, సీతమ్మధార లోని పోర్ట్ ట్రస్ట్ మైదానం వద్ద ఆరంభమైంది.  ఈ యాత్రను భారతీయ జనతాపార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ

ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు ప్రత్యేక పూజ చేసి ఆరంభించారు. భారీ వాహనం లో శ్రీ సీత, రామ, లక్షణ, హనుమ విగ్రహాలను ఏర్పాటు చేసి, ఆ వాహనం ముందుగా సీతారాముల ఉత్సవ విగ్రహాలతో పల్లకి నడుస్తుండగా, భారీ సంఖ్యలో భక్తులు, శోభాయాత్ర లో పాల్గొన్నారు. వీధులన్నీ జై శ్రీ రామ్, జై హనుమాన్ నినాదాలతో మారుమ్రోగిపోయింది. 

రామ

మందిరం మన అందరిదీ: మాజీ ఎమ్మెల్యే విష్ణు

ఈ సందర్బంగా విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ అయోధ్య మందిరం మానవులందరి ఆలయం అని, శ్రీరాముడు ఏ ఒక్కరికో చెందినవాడు కాదన్నారు. ఒక మనిషి మహోన్నతుడిగా యుగాల తర్వాత కూడా ఎలా కొనియాడబడాలో నిరూపించి చూపించిన మానవతామూర్తి శ్రీరామచంద్రుడు అన్నారు. కోట్లాది మంది భక్తుల

చిరకాల వాంఛ, ఆకాంక్ష అయోధ్యలో భవ్య రాముని మందిర నిర్మాణం అన్నారు. కేవలం కొందరు ధనికులు ఈ ఆలయాన్ని తామే నిర్మించేస్తామంటూ ప్రధాని నరేంద్ర మోడీ, ఆలయ కమిటీ పెద్దలను కలిసినప్పడికీ, సామాన్యుల నుంచి, అసామాన్య నేతల వరకూ ఈ అయోధ్య రామ మందిర నిర్మాణంలో భాగస్వాములు కావలి అనే సంకల్పంతో గ్రామగ్రామాన శోభాయాత్రలు చేపట్టి, కనీసం

రూ. 10 ల నుంచి విరాళం సేకరిస్తున్నట్టు తెలిపారు. ఈ విరాళం నేరుగా ట్రస్ట్ కు ఆన్ లైన్ ద్వారా చెల్లించవచ్చని, ఇంటింటికి వచ్చే కార్యకర్తల వద్ద అయోధ్య ట్రస్ట్ ఇచ్చిన కూపన్లు ( అధికారికంగా ఉన్నవి మాత్రమే) సరిచూసుకుని విరాళం ఇచ్చి, తీసుకోవచ్చన్నారు. అత్యధిక సంప్రదాయవాదులు, మానవతావాదులు నివాసం ఉండే సీతమ్మధార,

బాలయ్యశాస్త్రి లే అవుట్ లో చాలా మంచి స్పందన వచ్చిందని, రాజకీయ పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా భక్తులు విరాళాలను నేరుగా ట్రస్ట్ సభ్యులకు అందించడం ఆనందంగా ఉందన్నారు. 

శ్రీరాముని వెంటే మేముంటాం: బిజెవైఎం ఫణి 

రామో విగ్రహవాన్ ధర్మ: అన్నట్టుగా ధర్మానికి మారుపేరుగా నిలిచినా మానవతామూర్తి

శ్రీరామచంద్రుని వెంటే మేముంటామని భారతీయ జనతా యువమోర్చ నగర అధ్యక్షులు విజయ్ శంకర్ ఫణి తెలియచేసారు. ఆదివారం శ్రీరామ శోభాయాత్రలో భాగంగా శ్రీరామ పల్లకిని తన భుజం పై పెట్టుకుని యాత్ర మొత్తం పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ  శ్రీరామ పాలనా, ఆచరణ  యువతకు ఎంతో  ప్రేరణ కలిగిస్తున్నాయని, రామునివెంటే

మేముంటామన్నారు. ఈ యాత్రలో బీజేవైఎం యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారన్నారు. 


ఈ యాత్ర విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ మైదానం ఈస్ట్ గేట్ నుంచి బయలుదేరి,  బాలయ్య శాస్త్రి లే అవుట్ డబుల్ రోడ్, అభయ ఆంజనేయస్వామి ఆలయం, కృష్ణ మందిరం, షిర్డీ సాయి బాబా ఆలయం, మీదుగా హెచ్ బి కొలని లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం టెంపుల్,

సీతమ్మదార రైతు బజార్ మీదుగా గురుద్వార్ జంక్షన్ వద్ద ముగిసింది. 

బీజేపీ అరకు పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జి పరశురామ రాజు ఆధ్వర్యవం లో జరిగిన ఈ శోభాయాత్ర లో చిన్న పిల్లల నుంచి, వృద్ధుల వరకూ, యువతి, యువకులు, మహిళలు, పురుషులు, పాత్రికేయ రంగ ప్రతినిధులు, మేధావులు, పారిశ్రామికవేత్తలు, సామాన్యులు, విశ్వహిందూ

పరిషత్ , బీజేపి, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తజనం చేతబూనిన శ్రీరామ ధ్వజాలతో వీధులు కాషాయమయంగా మారిపోయాయి.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam