DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్థానిక ఎన్నికలు యధావిధిగా జరపాల్సిందే: సుప్రీం కోర్టు 

*ప్రభుత్వ, ఉద్యోగుల వ్యాజ్యాలు కొట్టేసిన సుప్రీం కోర్టు*

*సుప్రీం ఆదేశాలు శిరసావహిస్తాం: ఉద్యోగ సంఘాలు*

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, జనవరి 25, 2021  (డి ఎన్ ఎస్):* ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయడం కుదరదని, యధావిధిగా ప్రకటించిన తేదీల ప్రకారం

నిర్వహించాలని భారత అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. సోమవారం మధ్యాహ్నం జరిగిన విచారణ అనంతరం సుప్రీం కోర్టు లో జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ హృషికేశ్‌రాయ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్లన్నంటినీ కొట్టి వేసింది. ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ హైకోర్టు

ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. 

రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపించారు.  గోవా సహా పలు రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయని, కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం వాయిదా

వేశారని రోహత్గి కోర్టుకు విన్నవించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు వ్యాక్సిన్ భద్రతలో ఉన్నారని వివరించారు. రాష్ట్ర హైకోర్టు సింగిల్‌ జడ్జి ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ తీర్పు ఇచ్చారని రోహత్గి తెలిపారు. వ్యాక్సినేషన్‌ కోసం 5 లక్షల మంది సిబ్బంది అవసరమవుతారని పేర్కొన్నారు. ఈ

విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని వెల్లడించారు.

*సుప్రీం ఆదేశాలు శిరసావహిస్తాం: ఉద్యోగ సంఘాలు*

సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను శిరసావహిస్తామని, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలియచేసారు. అయితే తాము ఎవరికీ వ్యతిరేకం కాదని, అయితే కోవిడ్ పూర్తి స్థాయిలో సమసిపోలేదని, తమకు

రక్షణ భాద్యతలు ఎవరు తీసుకుంటారని అనుమానాన్ని రేకెత్తుతున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam