DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కేంద్ర బలగాలకై కేంద్ర హోం సెక్రటరీకి ఎస్ఈసీ లేఖ?

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, జనవరి 25, 2021  (డి ఎన్ ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సహకరించబోమని రాష్ట్రంలో కొన్ని ఉద్యోగ సంఘాలు బహిరంగంగా ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర బలగాలను పంపమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోమ్ శాఖా

కార్యదర్శి లేఖ వ్రాసినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణ పై రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్నికల కమిషనర్ ల మధ్య పోటాపోటీ ఆధిపత్యం కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ న్యాయ పోరాటం జరుగుతున్నా సరే ఉద్యోగులు నేరుగానే ఈసీ తో బహిరంగ సహాయ నిరాకరణను ప్రకటించారు. ఈ క్రమం లోనే ఎన్నికల

నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా,  రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కేంద్రబలగాల సహాయం కోసం లేఖ వ్రాయడంతో ఉద్యోగ సంఘాలు మెట్టు దిగవలసి వచ్చింది. సుప్రీం కోర్టు సైతం ఎస్ ఈ సి కి అనుకూలంగా తీర్పు చెప్పడం, రాష్ట్ర ప్రభుత్వం తో పాటు ప్రధాన కార్యదర్శి, ఉద్యోగ సంఘాలకు ఒప్పుకోక తప్పని పరిస్థితి నెలకొంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam