DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎస్పీ బాలు పద్మ విభూషణ్, అన్నవరపు కి పద్మశ్రీ

*పద్మ పురస్కారాల గ్రహీతల వివరాలు ప్రకటన* 

*తెలుగువాడికి తమిళనాడు కోటాలో అవార్డు ప్రదానం*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, )*  

*ఢిల్లీ / విశాఖపట్నం, జనవరి 25, 2021  (డి ఎన్ ఎస్):* తన గాత్రంలో దాదాపు 50 వేలకు పైగా వివిధ భాషల్లో పాటలు పాడి ప్రపంచ రికార్డు సృష్టించిన గాన గంధర్వుడు ఎస్పీ

బాల సుబ్రహ్మణ్యం ( తమిళనాడు) కు పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించారు. కేంద్రం సోమవారం ప్రకటించిన 2021 ఏడాదికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. 119 మందికి పద్మ పురస్కారాలు ల్లో  ఏడుగురికి పద్మ విభూషణ్ పురస్కారాలు, 10 మందికి పద్మ భూషణ్ పురస్కారాలు, 102 మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించాయింది. 
 
ఎస్పీ బాలుకు

తమిళనాడు కోటా లో సాంస్కృతిక రంగం కు గాను ఈ అవార్డు ప్రకటించింది. 

పద్మవిభూషణ్ పురస్కారం పొందిన ఇతరుల్లో  జపాన్ మాజీ ప్రధాని షింజో అబే, కర్ణాటకకు చెందిన డా. బెల్లె మొనప్ప హెగ్డే, అమెరికాకు చెందిన నరీందర్ సింగ్ కప్పని, మౌలానా, పురావస్తు శాఖా శాస్త్రజ్ఞుడు బిబి లాల్, ఒడిశా కు చెందిన సుదర్శన్ సాహులు ఉన్నారు.

  

పద్మభూషణ్ అవార్డులు : . . . 

1. కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర - ఆర్ట్ - కేరళ,  2. తరుణ్ గొగోయ్- ప్రజా సేవ - అస్సాం, 3. చంద్రశేఖర్ కంబరా - సాహిత్యం- కర్ణాటక, 4. సుమిత్ర మహాజన్ - ప్రజా సేవ - మధ్య ప్రదేశ్, 5. నృపేంద్ర మిశ్రా - సర్వీస్ - ఉత్తర్ ప్రదేశ్, 6. రామ్ విలాస్ పాశ్వాన్- 
ప్రజా సేవ - బీహార్, 7. కేశూభాయ్ పటేల్ -

ప్రజా సేవ - గుజరాత్, 8. కల్బే సాదిక్ - ఉత్తర్  ప్రదేశ్, 9. రజనీకాంత్ దేవిదాస్ షరాఫ్ - పరిశ్రమలు- మహారాష్ట్ర, 10. తర్లోచన సింగ్ - ప్రజా సేవ - హర్యానా.

102 మంది కి పద్మ శ్రీ పురస్కారాలు ప్రకటించారు. వారిలో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన సుప్రసిద్ధ వయోలిన్ విద్వాంసులు అన్నవరపు రామస్వామి, సాహిత్యకారులు అసవాది ప్రకాశ్ రావు, కళా

రంగానికి చెందిన నిడుమోలు సుమతి లు ఉన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam