DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జగన్ సర్కార్‌ చేసిన ఇద్దరి ఐఏఎస్ ల బదిలీకి ఎస్ఈసి బ్రేక్ 

*పంచాయితీరాజ్ అధికారుల బదిలీ పై ఎస్ ఈ సి అభిశంసన*  

*కోడ్ నిబంధనల ప్రకారమే అధికారుల బదిలీ జరగాలి:నిమ్మగడ్డ* 

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, జనవరి 26, 2021  (డి ఎన్ ఎస్):* రాష్ట్రంలో జరుగుతున్నా స్థానిక ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ అధికారిని

బదిలీ చెయ్యాలనుకున్న ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారమే చెయ్యాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వానికి తెలిపినట్టు సమాచారం. సోమవారం రాత్రి రాష్ట్ర పంచాయితీరాజ్ ప్రిన్సిపాల్ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజ శంకర్ లను బదిలీ చేస్తున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి చేసిన ప్రకటనపై

ఎస్ ఈ సి స్పందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు లో ఉన్నందున, ఎవరిని బదిలీ చెయ్యాలన్నా ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారమే చెయ్యాలని, వీరిద్దరి బదిలీ పై అయన అభిశంసన తెలిపారు. ఇద్దరు ఉన్నతాధికారుల బదిలీల ప్రతిపాదనలను రాష్ట్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా ను

సిద్ధం చెయ్యని కారణంగా వీరిద్దరి పై బదిలీ వేటు వేస్తున్నట్టు చెప్పడం సరికాదన్నారు. ఈ పోస్ట్ లోకి కొత్తగా వచ్చే అధికారులకు ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కొంత ఇబ్బందికరంగా ఉంటుందన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam