DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పద్మ పురస్కారం ప్రతిభకు పట్టాభిషేకం: జనసేనాని

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జనవరి 26, 2021  (డి ఎన్ ఎస్):* ప్రతిభావంతులకు పట్టంగట్టే విధంగా పద్మ పురస్కారాల ఎంపిక సాగింది. వీరందరికీ నా తరఫున, జనసేన పక్షాన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శుభాభినందనలు తెలియచేసారు. 

గాన గంధర్వుడు దివంగత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం

ను పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపిక చేయడం ముదావహం అని అన్నారు. చలనచిత్ర సంగీత రంగంపై బాలు గారి ముద్ర చెరగనిదని, మరణానంతరం ఈ పురస్కారానికి ఎంపిక చేయటం ఆయన కీర్తిని మరింత పెంచిందన్నారు. 

ప్రఖ్యాత గాయని కెఎస్. చిత్ర కు పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక చేయడం సంతోషకరం గా ఉందన్నారు. నాలుగు దశాబ్దాలుగా దక్షిణాది

భాషలతోపాటు పలు భాషల్లో తన గళంతో శ్రోతలను మైమరపించారు. 

ప్రముఖ వయొలిన్ విద్వాంసులు అన్నవరపు రామస్వామి కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి చేసిన సేవలకు పద్మశ్రీ గౌరవం దక్కిందని అన్నారు. 

మృదంగ విద్వాంసులంటే పురుషులే అనుకొన్న సమయంలో తొలి మహిళ మృదంగ విద్వాంసురాలిగా కచేరీలు చేసిన విద్వన్మణి సుమతి

ప్రతిభకు సరైన గుర్తింపు గా పద్మశ్రీ పురస్కారంతో దక్కిందన్నారు.

మన మాతృభాష తెలుగుకు విశేషమైన సేవలు అందించి, అవధాన విద్యలో దిట్టగా నిలిచిన ఆశావాది ప్రకాశరావు ని పద్మశ్రీ వరించడం మన తెలుగు అవధానానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam