DNS Media | Latest News, Breaking News And Update In Telugu

షెడ్యూల్‌ వాయిదా కుదరదు, కోర్టు ఆదేశం: సీఎస్‌

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, జనవరి 27, 2021  (డి ఎన్ ఎస్):* సుప్రీంకోర్టు తీర్పు మేరకు.. స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో ఉద్యోగులందరూ పాల్గొనాల్సిందేనని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ తేల్చిచెప్పారు. బుధవారం ఉద్యోగ సంఘాల నేతలతో అత్యవసర భేటీ అయ్యారు. రాష్ట్ర

ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మేరకు నిర్వహించాల్సిందేనని.. వాయిదా వేయడం కుదరదని స్పష్టం చేశారు.  కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం పూర్తయితే తప్ప.. ఎన్నికల విధుల్లో  పాల్గొనబోమని ఉద్యోగ సంఘాల నేతలు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా చెబుతుండడంతో సీఎస్‌ మంగళవారం వారితో అత్యవసరంగా

సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆయా సంఘాల నేతలు వెంకట్రామిరెడ్డి, చంద్రశేఖరరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు కేఆర్‌ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

ఎన్నికల షెడ్యూల్‌ను సవరిస్తూ ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకుందని.. మరి కొద్ది రోజులు వాయిదా వేసి.. వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని సంఘాల నేతలు కోరారు.

దీనికి ఆదిత్యనాథ్‌ దాస్‌ అంగీకరించలేదు. ఈ సమయంలో షెడ్యూల్‌ వాయిదా కుదరదన్నారు. ఇదిలావుంటే గ్రామ వార్డు సంఘాలకు ఏవిధంగా లేఖ రాస్తారు అని ప్రశ్నించారు. ఎన్నికలకు గ్రామ, వార్డు సిబ్బంది దూరంగా వుండాలని తేల్చిచెప్పిరు. ఇప్పటికే వాలంటరీర్ వద్ద వున్న ఫోన్లు మరియు వారి యొక్క ఐడి కార్డు తీసుకోవాలని సూచించారు. ఓటర్

కార్డులు వాలంటీర్ కి ఇవ్వకూడదని తెలిపారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam