DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రామతీర్ధం గుడి చైర్మన్ గా అశోక్ తొలగింపు చెల్లదు: హైకోర్టు

*మూడు ఆలయాలకూ ఆయనే చైర్మన్ గా కొనసాగనున్నారు*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జనవరి 28, 2021  (డి ఎన్ ఎస్):* ఉత్తరాంధ్ర అయోధ్య రామతీర్ధాలు క్షేత్రం ఆలయ ధర్మకర్త గా అశోక్ గజపతి రాజు తొలగింపు ఆదేశాలు చెల్లవంటూ హైకోర్టు కొట్టివేసినట్టు తెలుగుదేశం సీనియర్ నేత

పాశర్ల ప్రసాద్ తెలియచేసారు. గత నెల ఆలయం సమీపంలోని బోడికొండ పై గల ఆలయంలో జరిగిన ఘటన కు బాధ్యుల్ని చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అశోక్ గజపతిరాజును ఆలయ చైర్మన్ గా తొలగిస్తూ అసంబద్ధ ఉత్తర్వులు జారీచేసిందన్నారు. అయితే దేవాదాయ శాఖపరిధిలో ఉన్న ఆలయంలో రక్షణ భాద్యతలు సరిగ్గా చెయ్యలేని ప్రభుత్వం, చైర్మన్ పై కక్షపూరితంగా

వ్యక్తిగత సాధింపు చేపట్టిందన్నారు. చట్టప్రకారం నియమావళి పాటించకుండా అశోక్ ను బాధ్యతల నుంచి తప్పించడం జరిగిందని కోర్టు అభిప్రాయపడిందన్నారు. 
విజయనగరం జిల్లా రామతీర్ధం, పైడితల్లి అమ్మవారి దేవస్థానం, తూర్పు గోదావరి జిల్లా మందేశ్వర స్వామి ఆలయానికి ప్రస్తుతం అశోక్ గజపతి చైర్మన్ గా కొనసాగనున్నారని

తెలిపారు. 

ఇదే క్రమంలో దేవాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎంతో ప్రతిష్ఠాకరమైన వంశస్తులైన పూసపాటి వారసులు అశోక్ గజపతి పై క్షమార్హమైన వ్యాఖ్యలు చెయ్యడం గమనార్హం అన్నారు. 

ఆలయంలో శ్రీరామ, సీత, లక్ష్మణుల విగ్రహాల పున: ప్రతిష్ట జరిగిన రోజే హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని శ్రీ రామచంద్రుడే

ఆశీర్వదించినట్టు గా అశోక్ గజపతి రాజు హర్షం వ్యక్తంచేశారన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam