DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అవాంఛిత గర్భ శిశువులకు ఐసిడిఎస్ అండగా నిలుస్తుంది

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, జనవరి 28, 2021  (డి ఎన్ ఎస్):* అవాంఛనీయ గర్భం ధరించిన మహిళలు ఐసీడీఎస్ అధికారులకు తెలియజేస్తే తగు చర్యలు తీసుకుంటామని పశ్చిమ గోదావరి జిల్లా ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్ అధికారి ఆశా రోహిణి భావోద్వేగంగా చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు మండలం,

ఊనగట్ల గ్రామంలో సభ్యసమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది. దీనిపై విచారణ చేస్తున్న ఆమె ఆవేదన చెందారు. అవాంఛిత పిల్లలను సంరక్షించి తామే వేరే వారికి దత్తత ఇస్తామని, ముళ్లకంపల్లో వదలద్దని సూచించారు. 

అప్పుడే పుట్టిన పసికందును గుర్తు తెలియని వ్యక్తులు పొదల్లో వదిలేయడంతో ఆ పసికందును కుక్కలు

పీక్కుతిన్నాయి. తర్వాత బిడ్డ మృతదేహాన్ని రోడ్డు మీదకు ఈడ్చుకొచ్చాయి. బిడ్డ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు గ్రామ మహిళా పోలీసు తెలియజేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. విషయం తెలిసిన ఐసీడీఎస్ అధికారులు సైతం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పసికందు మృతదేహం పడి ఉన్న తీరును పరిశీలించిన

ఐసీడీఎస్ సీడీపీఓ ఆశా రోహిణి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ దగ్గర్లోనే పొదలలో ఎవరో గుర్తు తెలియని మహిళ ప్రసవం జరిగినట్లు గుర్తించారు. ప్రసవం జరిగిన ఆనవాళ్లను కనుగొన్నారు. 

పొలాల్లోనే ప్రసవించిన మహిళ పసికందును అక్కడే వదిలి వెళ్లిపోవడంతో మృతి చెందిందని తెలిసింది. పొదల్లో ఉన్న పసికందు

మృతదేహాన్ని కుక్క నోటకరచుకొని వస్తుండగా స్థానికులు గమనించి తరమడంతో రోడ్డుపైనే పసికందు మృతదేహాన్ని కుక్క వదిలి వెళ్లిపోయింది. వెంటనే స్థానికులు గ్రామ మహిళా కానిస్టేబుల్ ద్వారా పోలీసులకు, ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam