DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆన్ లైన్లో నామినేషన్ స్వీకరించే ప్రక్రియ చూడండి   

*ఎన్నికల ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించండి* 

*రాష్ట్ర గవర్నర్ ను కోరిన జనసేన, బీజేపీ బృందం*

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, జనవరి 28, 2021  (డి ఎన్ ఎస్):* రాష్ట్రంలో మొదలైన పంచాయతీ ఎన్నికల ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించి ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా

ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయమని జనసేన, బీజేపీ ప్రతినిధుల బృందం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కోరారు. గురువారం గవర్నర్ ను కలిసిన వారిలో జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, బీజేపీ నుంచి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు,  కన్నా లక్ష్మీనారాయణ, మధుకర్ లు ఉన్నారు. గత రెండేళ్ల కాలం నుంచి నేటి

వరకూ జరిగిన విషయాలను తెలియచేస్తూ, ప్రస్తుత పరిస్థితులపై ఒక వినతి పత్రం సమర్పించారు.

అనంతరం మీడియా తో మాట్లాడుతూ అభ్యర్థులను భయ పెట్టె అవకాశం లేకుండా ఆన్ లైన్ లో నామినేషన్ స్వీకరించే ప్రక్రియ తీసుకురావాలన్న విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లాం అన్నారు. గతంలో నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ

నాయకులు అడ్డుకున్నారని, ఈసారి అలాంటి పరిస్థితి లేకుండా చూడాలని కోరామన్నారు. ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ప్రోత్సహకాలు ఇవ్వడం సహజమే. దాన్ని మేము ఆహ్వానిస్తాం. అయితే ప్రభుత్వం ప్రలోభపెట్టి, భయపెట్టి ఏకగ్రీవాలు చేసే విధంగా కుట్ర పన్నుతున్నట్టు కనబడుతోందన్నారు. ఇటీవల మంత్రులు, ప్రభుత్వ పెద్దలు జారీ చేసిన ప్రకటనలు,

ఇచ్చిన స్టేట్ మెంట్లను గవర్నర్ వద్ద ప్రస్తావించాం అన్నారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam