DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏసీబీ కి చిక్కిన విశాఖ ఏఈ చేప కాదు తిమింగలమే.

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జనవరి 28, 2021  (డి ఎన్ ఎస్):* అవినీతి పెచ్చుమీరిపోయిన నేపథ్యంలో ఏసీబీ అధికారులకు ఒక తిమింగలమే చిక్కింది. విశాఖ నగర శివారు ప్రాంతంలోని కొమ్మది ఎలక్ట్రికల్ ఏ. ఇ నాగేశ్వరరావు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగంపై నాగేశ్వరావు

ఆస్తులకు సంబంధించి  ఏసీబీ అధికారులు గురువారం ఆరు చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఒక సాధారణ ఎలక్ట్రికల్ ఇంజనీర్...అతను జీతం తో పాటు గీతం కలిపి తాను సర్వీస్ చేసిన కాలంలో సంపాదిస్తే 2, 3 కోట్లు ఉండవచ్చు. కానీ అతను సంపాదించిన ఆస్తులు చూసి ఇప్పుడు ఏసీబీ అధికారులే షాక్ అవుతున్నారు.  

నాగేశ్వరరావుకు విశాఖలో

సీతమ్మధార, సీతంపేట, విశాలాక్షి నగర్, ఎంవిపి కాలనీ, రాంబిల్లి ప్రాంతాలతోపాటు తెలంగాణ జిల్లాల్లో భూములు, ఇల్లు, స్థలాలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అలాగే 3 బ్యాంకు లాకర్ లు సీజ్ చేశారు. 19 91 సర్వీసులో నాగేశ్వరరావు 94 లో ఏసీబీ అధికారులకు చిక్కి సస్పెండ్ అయ్యారు. 2012లో తిరిగి విధుల్లో చేరిన నాగేశ్వరరావు లంచం

ఇవ్వనిదే మీటర్ కనెక్షన్ కూడా మంజూరు చెయ్యారనీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏసీబీ అధికారులు దగ్గర ఉన్న ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో పెద్దమొత్తం కోట్లల్లో విలువ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ దాడులు ఏసీబీ అడిషనల్ ఎస్పీ షకీలా భాను నేతృత్వంలో విశాఖ డి.ఎస్.పి కే రంగరాజు, ఏసీబీ అధికారులు పాల్గొని సోదాలు

జరుపుతున్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam