DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పంచాయితీ ఎన్నికలు శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం సిద్ధం

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు SV,  బ్యూరో చీఫ్, శ్రీకాకుళం)*  

*శ్రీకాకుళం, జనవరి 28, 2021  (డి ఎన్ ఎస్):* నాలుగు విడతలలో రాష్ట్రంలో జరుగనున్న పంచాయితీ ఎన్నికలకు శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం సిద్ధం గా ఉన్నట్టు జిల్లా కలెక్టర్ జె. నివాస్ తెలియచేస్తున్నారు. 

1164 గ్రామ పంచాయితీలు, 10924 వార్డులలో ఎన్నికలు .   18

లక్షల 48 వేల 419 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కోనున్నారు.  11,041పోలింగు కేంద్రాలలో 14,083 మంది పోలింగు అధికారులు, 25,124 మంది పోలింగు సిబ్బంది ఎన్నికలలో విధులు నిర్వహించనున్నారు. 

మొదటి విడతలో 3 నియోజకవర్గాలు, 10 మండలాలు, 319 పంచాయితీలు, 2902 వార్డులలలో  ఎన్నికలు

1. ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలో 1. లావేరు , 2.

కొత్తూరు, 3. హిరమండలం మండలాలలో

2. పాతపట్నం నియోజకవర్గం పరిధిలో 1. పాతపట్నం, 2. మిలియాపుట్టి, 3. ఎల్.ఎన్. పేట, 4. కొటబొమ్మాళి, 5. సంతబొమ్మాళి మండలాలలో   

3. టెక్కలి నియోజకవర్గం పరిధిలో 1. టెక్కలి, 2. నందిగాం మండలాలలో మొదటి విడత ఎన్నికలు జరుగనున్నాయి. 

ఈ మొదటి విడత ఎన్నికల్లో 
4 లక్షల 80 వేల 108 మంది

ఓటర్లు  తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
2940 పోలింగు కేంద్రాలలో పోలింగు జరగనున్నది.
3666 మంది పోలింగ్ అధికారులు, 6606 మంది పోలింగ్ సిబ్బంది  ఎన్నికలలో పాల్గొంటారు.

రెండవ విడతలో 3 నియోజకవర్గాలు, 10 మండలాలు, 278 పంచాయితీలు, 2716 వార్డులలో ఎన్నికలు

1. ఇఛ్ఛాపురం 2. పలాస 3.రాజాం  నియోజకవర్గాలు
1.

ఇఛ్చాపురం, 2. కంచిలి, 3. కవిటి, 4. సోంపేట, 5. పలాస, 6. వజ్రపుకొత్తూరు, 7. మందస, 8. రాజాం, 9. సంతకవిటి, 10. వంగర మండలాలలో రెండవ విడత ఎన్నికలు జరుగనున్నాయి. 

ఈ రెండవ విడత ఎన్నికల్లో  
5 లక్షల 5 వేల 750 మంది ఓటర్లు  తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
2734 పోలింగు కేంద్రాలలో పోలింగు జరగనున్నది.
3712 మంది పోలింగ్ అధికారులు
/> 6446 మంది పోలింగ్ సిబ్బంది రెండవ విడత పంచాయితీ ఎన్నికలలో విధుల నిర్వహణ.

మూడవ  విడతలో 3 నియోజకవర్గాలు, 9 మండలాలు, 293 పంచాయితీలు, 2648 వార్డులలలో   పంచాయితీ ఎన్నికలు

1. ఆమదాలవలస, 2. పాలకొండ,  3. రాజాం  నియోజకవర్గాలు

1. ఆమదాలవలస,  2. బూర్జ , 3. పొందూరు, 4. సరుబుజ్జిలి, 5. భామిని,   6. పాలకొండ,  7. వీరఘట్టం,

 8. సీతంపేట, 9. రేగిడి, మండలాలలో మూడవ విడత ఎన్నికల నిర్వహణ

ఈ మూడవ విడత ఎన్నికల్లో
3 లక్షల77 వేల 867 మంది ఓటర్లు తమ ఓటు హక్కును మూడవ విడత  ఎన్నికలలో వినియోగించుకోనున్నారు.
2671 పోలింగు కేంద్రాలలో పోలింగు జరగనున్నది.
3031  మంది  పోలింగ్ అధికారులు
5702  మంది పోలింగ్ సిబ్బంది  మూడవ విడత పంచాయితీ ఎన్నికలలో

పాల్గొంటారు.

నాలుగవ  విడతలో 3 నియోజకవర్గాలు, 9 మండలాలు, 274 పంచాయితీలు, 2658 వార్డులలలో  ఎన్నికలు

1. ఎచ్చెర్ల, 2. శ్రీకాకుళం,  3. నరసన్నపేట  నియోజకవర్గాలు
1. ఎచ్చెర్ల,  2. జి.సిగడాం, 3. రణస్థలం, 4. గార, 5. శ్రీకాకుళం, 6. నరసన్నపేట, 7.  జలుమూరు, 8. పోలాకి,  9. సారవకోట మండలాలు.

4 లక్షల 84 వేల 694 మంది ఓటర్లు  తమ

ఓటు హక్కును వినియోగించుకోనున్నారు
2696 పోలింగు కేంద్రాలలో పోలింగు జరగనున్నది.
3674 మంది పోలింగ్ అధికారులు,
6370 మంది పోలింగ్ సిబ్బంది  ఎన్నికలలో పాల్గొంటారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam