DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గైర్హాజరైన ఐదు గురు ఏ.ఆర్.ఓలకు షోకాజ్ నోటీసులు

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు SV,  బ్యూరో చీఫ్, శ్రీకాకుళం)*  

*శ్రీకాకుళం, జనవరి 28, 2021  (డి ఎన్ ఎస్):* పంచాయతీ ఎన్నికల మొదటి దశ (స్టేజ్ -1) సహాయ రిటర్నింగు అధికారుల శిక్షణకు హాజరు కాని అధికారులకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి గురు వారం షోకాజ్ నోటీసులు జారీ చేసారు. ఈ మేరకు గురు వారం షోకాజ్

నోటీసులు జారీ చేస్తూ మూడు రోజులలో సంజాయిషీ సమర్పించాలని ఆదేశించారు. ఎన్నికల నియమ నిబంధనలు, సిసిఏ నిబంధనల క్రింద క్రమ శిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన శిక్షణా తరగతులు గురు వారం జరుగుతున్న సమాచారం రిటర్నింగు అధికారులుగా నియమితులైన ఉపాధ్యాయులకు తెలిసినప్పటికి

గైర్హాజరు కావడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. 
    షోకాజ్ నోటిసులను  పాతపట్నం మండలం సీతరాంపల్లి ఎంపియుపి పాఠశాల ఉపాధ్యాయులు పాడి భాగ్యలక్ష్మి, చంగుడి ఎంపియుపి ఫాఠశాల ఉపాధ్యాయులు బొమ్మన విజయ లక్ష్మి, చొర్లంగి ఎంపిపి పాఠశాల ఉపాధ్యాయులు కాలవలస గోపాల రావు., కొత్తూరు మండలం సామ్రాజ్యపుర ఎంపియుపి పాఠశాల స్కూల్

అసిస్టెంట్ సతివాడ గణేష్ కుమార్, కొత్తూరు మండలం కడుమ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ జెనుపాటి శంకర రావులకు జారీ చేసారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam