DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మంత్రులు, సలహాదారు లక్ష్మణరేఖ దాటేస్తున్నారు: ఎస్ఈసీ

*గవర్నర్‌ హరిచందన్‌కు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ లేఖ*

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, జనవరి 29, 2021  (డి ఎన్ ఎస్):* ఎన్నికల నిర్వహణకు సహకరిస్తామని న్యాయస్థానానికి తెలిపినప్పడికి మంత్రులు, సలహాదారులు లక్ష్మణరేఖ దాటేస్తున్నారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డా. నిమ్మగడ్డ రమేష్

కుమార్ గవర్నర్‌ హరిచందన్‌కు వ్రాసిన లేఖలో వెల్లడించారు. శుక్రవారం ఆయన లేఖలో సుప్రీంకోర్టు ఆదేశాలను లేఖలో ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణలో నిమగ్నమైన తనపై మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స లక్ష్మణరేఖ దాటి, తనపై విమర్శలు చేస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. తనపై మంత్రుల వ్యక్తిగత  విమర్శలు కోడ్‌

ఉల్లంఘన కిందకు వస్తాయని తెలిపారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పై సైతం గవర్నర్‌కు నిమ్మగడ్డ ఫిర్యాదు చేసారు. సజ్జల ప్రభుత్వ సలహాదారుగా ఉంటూ పార్టీ ఆఫీసు నుంచి తనపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పదవిలో ఉంటూ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. సుప్రీంకోర్టులో

కేవియట్‌ వేసిన తనకు వ్యతిరేకంగా సజ్జల వ్యాఖ్యలు ఉన్నాయని వివరించారు. సజ్జల వ్యాఖ్యలపై తదుపరి చర్యలకు అటార్నీ జనరల్‌ సలహా తీసుకోవాలని గవర్నర్‌ను విన్నవించారు. సజ్జలపై చర్యల విషయంలో అడ్వకేట్‌ జనరల్‌పై నమ్మకం లేదని తెలిపారు. సజ్జలను వెంటనే పదవి నుంచి తప్పించాలని గవర్నర్‌ను కోరారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam