DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ నుంచి బొర్ర వరకూ భద్రతా పై జీఎం పరిశీలన

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జనవరి 29, 2021  (డి ఎన్ ఎస్):*విశాఖపట్నం నుండి బోర్రాగుహలు వరకు వివిధ భద్రతా పనులను సమీక్షించడానికి మరియు ట్రాక్ నిర్వహణ కోసం విండో ట్రైలింగ్ తనిఖీని తూర్పు కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ విద్యా భూషణ్ నిర్వహించారు. శుక్రవారం విశాఖపట్నం

డివిజన్ లో పర్యటించిన ఆయనతో పాటు విశాఖపట్నం డివిజనల్ రైల్వే మేనేజర్ చేతన్ కుమార్ శ్రీవాస్తవ, ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ ప్రమోద్ కుమార్ జెనా, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్ ఎన్ఎస్ ఉకే, ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ గౌతమ్ దత్తా, ఎడిఆర్ఎం (ఇన్ఫ్రా) అక్షయ్ సక్సేనా, డివిజన్ అధికారులు పాల్గొన్నారు. 



డివిజన్ లో బొర్రాగుహలు స్టేషన్‌లో నిర్వహించిన వివిధ అభివృద్ధి కార్యకలాపాలను ఆయన పరిశీలించారు. బొర్రాగుహాలూ నుండి చిమిడిపల్లికి తాగునీటి సరఫరా యొక్క ఆగ్మెంటేషన్ పనులను ఆయన ప్రారంభించారు. ఇది చిమిడిపల్లి స్టేషన్ మరియు సమీప కాలనీ నివాసులకు తగినంత తాగునీటి సౌకర్యాన్ని అందిస్తుంది. 

అనంతరం జిఎం అరకు

వెళ్లి అరకు రైల్వే స్టేషన్ వద్ద పునరుద్ధరించిన అధికారుల విశ్రాంతి గృహాన్ని ప్రారంభించారు. వివిధ భద్రతా పనులు, సౌకర్యాలు మరియు అభివృద్ధి కార్యకలాపాలను నిర్వహించడానికి డివిజనల్ అధికారులు చేసిన కృషిని ఆయన ప్రశంసించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam